NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?
    తదుపరి వార్తా కథనం
    jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?
    ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?

    jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 16, 2024
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కళాశాలలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

    ఈ ప్రమాదంలో పదిమంది చిన్నారులు సజీవ దహనమయ్యారు.

    ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అన్న విషయం బయటికి రాగా, తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఓ నర్సు అగ్గిపుల్ల వెలిగించడమే దీనికి కారణమని ఒకరు చెప్పారు.

    యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు ఆక్సిజన్‌ సిలిండర్‌ పైప్‌ను కనెక్ట్‌ చేస్తున్నప్పుడు, పక్కనే మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించడంతో మంటలు చెలరేగాయని చెప్పారు.

    ఆక్సిజన్‌ అధికంగా ఉన్న ప్రదేశం కావడం వల్ల క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే భగవాన్ దాస్ నలుగురు పిల్లలను తన మెడకు బట్టతో చుట్టుకుని బయటకు పరిగెత్తాడు.

    Details

    ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు

    ఇతరుల సాయంతో మరికొంతమంది చిన్నారులను కాపాడామని ఆయన వివరించాడు. దట్టమైన పొగలు ఆస్పత్రి భవనాన్ని కమ్మేయడంతో అక్కడ ఉన్నవారు పరుగులు తీశారు.

    దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. అయితే సేఫ్టీ అలారాలు పనిచేయకపోవడం, వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉండటం వల్ల చిన్నారులను రక్షించలేకపోయామని బాధితుడు ఒకరు చెప్పారు.

    ఈ ప్రమాదంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    ఈ విషాద ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు నష్టపరిహాన్ని అందిస్తామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Kanwar Yatra: కన్వర్ యాత్ర ఆర్డర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనున్న సుప్రీం  భారతదేశం
    Uttarpradesh: 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం భారతదేశం
    #NewsBytesExplainer: ప్రేమ ఉచ్చులో చిక్కుకుని ఎవరైనా మతం మారితే జీవితాంతం జైల్లోనే గడుపుతారు.. ఈ చట్టం గురించి తెలుసుకోండి  భారతదేశం
    Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం ఇండియా

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మహారాష్ట్ర
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ బీజేపీ
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025