NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Firing At Durga Puja Pandal: బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Firing At Durga Puja Pandal: బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు
    బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు

    Firing At Durga Puja Pandal: బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 13, 2024
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దుర్గా పూజా వేడుకల సందర్భంగా బిహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

    ఆదివారం తెల్లవారుజామున అర్హా పట్టణంలోని దుర్గా పూజా మండపం వద్ద గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు.

    ఈ దాడిలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. సుమారు తెల్లవారుజామున, గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులపై పూజా మండపం వద్దకు చేరుకున్నారు.

    ఎటువంటి వాదన లేకుండా అక్కడ ఉన్నవారిపై గన్స్‌తో కాల్పులు జరిపారు. ఈ దాడి కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

    కాల్పుల్లో గాయపడిన వారిలో 19 ఏళ్ల అర్మాన్ అన్సారీ, 26 ఏళ్ల సునీల్ కుమార్ యాదవ్, 25 ఏళ్ల రోషన్ కుమార్, సిపాహి కుమార్‌లు ఉన్నారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు

    అర్మాన్ అన్సారీ వీపుపై, సునీల్ ఎడమ చేయిపై, రోషన్ కుడి మోకాలి కింద, సిపాహి నడుముపై కాల్పులు జరిగాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో రెండు బుల్లెట్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

    దుండగులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులు ఎవరు? ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    ఇండియా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    బిహార్

    Nitish Kumar: సోషల్ మీడియాలో నితీష్ కుమార్‌ను కాల్చి చంపుతామని బెదిరించిన యువకుడి అరెస్టు  నితీష్ కుమార్
    Pashupati Paras: బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ ఒప్పందం.. పశుపతి పరాస్ మంత్రి పదవికి రాజీనామా   భారతదేశం
    Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి  భారతదేశం
    Car Overturned In Begusarai: హోలీ పండుగ రోజు విషాదం.. కారు గోతిలో బోల్తా పడి కుటుంబంలోని ముగ్గురు మృతి  రోడ్డు ప్రమాదం

    ఇండియా

    Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్ టెక్నాలజీ
    Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు బెంగళూరు
    Fastest Fifty In Test: టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన టాప్‌ ప్లేయర్ల జాబితా.. భారత్ ప్లేయర్లకు దక్కని చోటు క్రికెట్
    Gangrape: తమిళనాడులో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025