NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amarnath Yatra 2025: 'బాబా బర్ఫానీ' మొదటి చిత్రం,వీడియో వైరల్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు
    తదుపరి వార్తా కథనం
    Amarnath Yatra 2025: 'బాబా బర్ఫానీ' మొదటి చిత్రం,వీడియో వైరల్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు
    'బాబా బర్ఫానీ' మొదటి చిత్రం,వీడియో వైరల్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు

    Amarnath Yatra 2025: 'బాబా బర్ఫానీ' మొదటి చిత్రం,వీడియో వైరల్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    12:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరగుతున్నాయి.

    సాధారణంగా అమర్‌నాథ్ అనే పేరు వినగానే,సహజంగా మంచుతో స్వయంగా ఏర్పడే శివలింగమే అందరికీ గుర్తుకు వస్తుంది.

    యాత్ర సమయం సమీపిస్తున్న తరుణంలో,మంచుతో ఏర్పడిన పవిత్ర శివలింగం భక్తుల దర్శనార్థం సిద్ధమవుతోంది.

    దీనితో పాటు,బాబా బర్ఫానీగా పిలవబడే శివలింగానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై వేగంగా వైరల్ అవుతున్నాయి.

    ఈ శివలింగం సుమారు 7 అడుగుల ఎత్తులో ఉందని చెబుతున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భక్తులు ఈ దృశ్యం చూసి కొత్త ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు.

    హిందూమతంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో అమర్‌నాథ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.

    ఏటా లక్షలాది మంది శివభక్తులు ఈ యాత్రలో పాల్గొనడం ఆనవాయితీగా మారింది.

    వివరాలు 

    పేర్లను నమోదు చేసుకున్న3.6 లక్షల మంది యాత్రికులు 

    జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో ఉన్నఅమర్‌నాథ్ గుహను శివుని నివాసంగా భక్తులు గాఢ విశ్వాసంతో భావిస్తారు.

    ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర జూలై 3వ తేదీ నుండి ప్రారంభమై,ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది.

    అధికారుల ప్రకారం,ఈ యాత్ర రక్షా బంధన్ పర్వదినంతో ముగియనుంది.

    మొత్తం 38రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. మార్గాల్లో మంచు తొలగించేందుకు అధికారులు కృషిచేస్తుండగా,ముఖ్యమైన రెండు మార్గాలైన బాల్టాల్, చందన్‌వారి మార్గాల్లో ఇప్పటికే మంచు తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.

    తాజా సమాచారం ప్రకారం,ఇప్పటి వరకు దాదాపు 3.6 లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

    యాత్ర ప్రారంభ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     పవిత్ర అమర్‌నాథ్ గుహలో 'మంచు శివలింగం'

    Amarnath Yatra 2025: First picture of Baba Barfani 🙏🙏

    According to the Amarnath Shrine Board, the Yatra will take place from July 3 to August 9 this year. pic.twitter.com/GbJxjeCjk9

    — Anup Gupta (@anoopphr) May 5, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమర్​నాథ్​ యాత్ర

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    అమర్​నాథ్​ యాత్ర

    అమర్​నాథ్​ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు భారతదేశం
    ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. ఈసారి ఎంతమంది మంచులింగాన్ని దర్శించుకున్నారో తెలుసా భారతదేశం
    Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న వ్యాన్ కు ప్రమాదం.. కాపాడిన BSF భారతదేశం
    Amarnath yatra: జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025