NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం 
    తదుపరి వార్తా కథనం
    Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం 
    ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం

    Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర భారతదేశం చలి తీవ్రతతో వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో మంచు దట్టంగా కురుస్తోంది.

    పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

    భారత వాతావరణ శాఖ ప్రకారం, దిల్లీలో గత 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా, కనిష్ఠం 7.6 డిగ్రీలుగా నమోదైంది.

    పొగమంచు తీవ్రత కారణంగా, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడని పరిస్థితి నెలకొంది.

    దిల్లీ ఎయిర్‌పోర్టులో విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. జనవరి 8వ తేదీ వరకు దిల్లీలో మంచు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

    వివరాలు 

    నోయిడాలో విద్యార్థులకు సెలవులు

    అంతేకాక, తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

    రవాణా సేవలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వంటి పరిస్థితుల కారణంగా ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను ముందుగానే తనిఖీ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి.

    ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది.

    చలి తీవ్రత దృష్ట్యా నోయిడాలో 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.

    బిహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణాలో కూడా దట్టమైన మంచు కురుస్తోంది. రాజస్థాన్‌లోని ఫతేపుర్‌లో గత 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలుగా నమోదైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Gold Rates: మళ్లీ పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.500 పెరిగిన తులం ధర బంగారం
    Acer Swift Neo: ఏసర్ స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్ విడుదల.. 14 అంగుళాల OLED డిస్‌ప్లే, 8.5 గంటల బ్యాటరీ లైఫ్  ల్యాప్ టాప్
    IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన ప్రభాస్

    దిల్లీ

    Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన వాయు కాలుష్యం
    old-age pension scheme: వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం పోర్టల్‌ను ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? పెన్షన్
    Air Pollution : దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..! ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025