NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nirmala Sitharaman: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని.. రాహుల్ గాంధీపై ఆర్థికమంత్రి ఫైర్.. 
    తదుపరి వార్తా కథనం
    Nirmala Sitharaman: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని.. రాహుల్ గాంధీపై ఆర్థికమంత్రి ఫైర్.. 
    యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని.. రాహుల్ గాంధీపై ఆర్థికమంత్రి ఫైర్..

    Nirmala Sitharaman: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని.. రాహుల్ గాంధీపై ఆర్థికమంత్రి ఫైర్.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    09:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సామాన్యుల జీవితానికి కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరులుగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు.

    ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు కష్టపడి పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులను, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థతో లబ్ధిపొందుతున్న పౌరులను అవమానించడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

    గతంలో బ్యాంకులను ఏటీఎంలా వాడినవారు ఎవరో చెప్పాలని విపక్ష నేతపై ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో ఆమె తన అభిప్రాయాలను సుదీర్ఘంగా పోస్ట్ చేశారు.

    వివరాలు 

    ప్రభుత్వరంగ బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు 

    నిరాధార ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అమితాసక్తి అని ఆమె ఎద్దేవా చేశారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వ రంగం, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు చరిత్రాత్మక పురోగతి సాధించాయని నిర్మలమ్మ పేర్కొన్నారు.

    యూపీఏ హయాంలో నిర్ణయాలరహితంగా కార్పొరేట్ రుణాల మంజూరు వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తుచేశారు.

    ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్ పాలనలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల అవసరాలకు ప్రభుత్వరంగ బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు.

    వివరాలు 

    మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు

    ''యూపీఏ పాలన సమయంలో బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా వేధింపులకు గురయ్యారు. తమకు అనుకూలంగా ఉన్నవారికే రుణాలు మంజూరు చేయాలని ఫోన్ కాల్‌లు చేసి బెదిరించారు. 2015లో అసెట్‌ క్వాలిటీ రివ్యూలో ఈ 'ఫోన్‌ బ్యాంకింగ్‌' కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయారా?'' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.

    మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు అమలు చేశామని ఆమె గుర్తుచేశారు.

    గత పది సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.3.26 లక్షల కోట్ల మూలధనం సమకూర్చామని, అలాగే పీఎం ముద్రా,పీఎం స్వానిధి,విశ్వకర్మ వంటి పథకాల ద్వారా 52 కోట్లకు పైగా తనఖా రహిత రుణాలు మంజూరు చేశామని ఆమె వివరించారు.

    వివరాలు 

    54కోట్ల మంది జన్‌ధన్‌ ఖాతాదారులు

    దేశవ్యాప్తంగా 54కోట్ల మంది జన్‌ధన్‌ ఖాతాదారులు ఉన్నారని తెలిపారు.

    ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ బుధవారం అఖిల భారత బ్యాంకింగ్‌ అధికారుల సమాఖ్య ప్రతినిధులతో సమావేశమై, అనంతరం కేంద్రంపై ఎక్స్‌లో తన విమర్శలు చేశారు.

    ప్రభుత్వ రంగ బ్యాంకులపై లాభాలను అధిక ప్రాధాన్యతగా చూపి ప్రజాప్రయోజనాలను దూరం చేయాలని ఒత్తిడి పెరుగుతోందని ఆయన ఆరోపించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్ 

    Leader of the Opposition (LoP) @RahulGandhi की बेबुनियाद बयानबाज़ी फिर से सामने आ गई है। भारत के बैंकिंग क्षेत्र, ख़ासकर पब्लिक सेक्टर बैंकों (PSBs) में, माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व में अभूतपूर्व सुधार हुए हैं।

    क्या विपक्ष के नेता से मिलने वालों ने उन्हें… https://t.co/5QUzsQlnle

    — Nirmala Sitharaman Office (@nsitharamanoffc) December 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    రాహుల్ గాంధీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నిర్మలా సీతారామన్

    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి
    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    లోక్‌సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం భారతదేశం

    రాహుల్ గాంధీ

    Lateral entry: లేటరల్ ఎంట్రీపై రాహుల్ గాంధీ ఆరోపణలకు అశ్విని వైష్ణవ్ కౌంటర్‌ అశ్విని వైష్ణవ్
    Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రాహుల్ ని కలిసిన వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా భారతదేశం
    Rahul Gandi: అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం అమెరికా
    Rahul Gandhi :తెలుగు భాషను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించిన రాహుల్ గాంధీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025