NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 3 Gandhis: నేటి పార్లమెంట్‌లో.. తొలిసారిగా ముగ్గురు 'గాంధీ' ఎంపీలు
    తదుపరి వార్తా కథనం
    3 Gandhis: నేటి పార్లమెంట్‌లో.. తొలిసారిగా ముగ్గురు 'గాంధీ' ఎంపీలు
    నేటి పార్లమెంట్‌లో.. తొలిసారిగా ముగ్గురు 'గాంధీ' ఎంపీలు

    3 Gandhis: నేటి పార్లమెంట్‌లో.. తొలిసారిగా ముగ్గురు 'గాంధీ' ఎంపీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    09:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ, తన సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీలతో కలిసి ఈ రోజు (గురువారం) పార్లమెంట్‌కు చేరుకోనున్నారు.

    ఈ రోజు ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంక ప్రమాణం చేయనున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు.

    అయితే, తరువాత ఆయన వయనాడ్ స్థానాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

    వివరాలు 

    సోనియా గాంధీ రాజ్యసభ.. రాహుల్, ప్రియాంక‌లు లోక్‌సభలో..

    2024 లోక్‌సభ ఎన్నికల నాటికి రాయ్‌బరేలీ నియోజకవర్గం నుండి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు.

    ఆ తరువాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం సోనియా గాంధీ రాజ్యసభలో ఉంటే, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంక‌లు లోక్‌సభలో ఉన్నారు.

    అంటే పార్లమెంట్‌ ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    అదేవిధంగా సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్‌సభలో సభ్యులుగా ఉన్నారు.

    అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలిచారు, డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

    అంతేకాకుండా, అఖిలేష్ కుటుంబానికి చెందిన మరో ముగ్గురు సభ్యులు ఫిరోజాబాద్, బదౌన్ నియోజకవర్గాల్లో విజయం సాధించారు.

    వివరాలు 

    రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ప్రాతినిధ్యం

    బీహార్‌కు చెందిన నేత పప్పు యాదవ్ పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు గెలిచారు, అయితే ఆయన భార్య రంజిత్ రంజన్ ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

    మరోవైపు, శరద్ పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    ఈ రీతిగా, భారత రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రాతినిధ్యం కలిగి ఉండడం ఒక ప్రత్యేకతగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పార్లమెంట్

    PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్ నరేంద్ర మోదీ
    డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  కేంద్ర కేబినెట్
    Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు?  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025