Page Loader
మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ 
వెనక్కి తీసుకున్న లాయర్

మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 20, 2023
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నేత మహువా మొయిత్రా పరువునష్టం దావాపై దిల్లీ హైకోర్టు అక్టోబర్ 31న విచారణకు లిస్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే,న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ సహా అనేక మీడియా సంస్థలపై మొయిత్రా పరువు నష్టం కేసు వేశారు. దర్శన్ హీరానందానీ నుంచి ప్రశ్నకు నగదు కోసం అదానీ గ్రూపుపై పార్లమెంటులో పలు ప్రశ్నలు అడిగారని దూబే తీవ్ర ఆరోపణలు చేశారు. మహువా మొయిత్రా తరపున న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ 'పరస్పర విరుద్ధ మాటలు కారణంగా ప్రశ్నకు డబ్బు కేసు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తదుపరి విచారణ అక్టోబర్ 31న జరగనుంది.తనను సభ నుంచి వెళ్లగొట్టేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని ఎంపీ ఆరోపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సభ నుంచి వెళ్లగొట్టేందుకు స్కెచ్ : ఎంపీ మహువా మొయిత్రా

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అక్టోబర్ 31న పరువు నష్టం కేసు విచారణ