NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే 
    తదుపరి వార్తా కథనం
    Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే 
    నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే

    Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే 

    వ్రాసిన వారు Stalin
    Sep 18, 2023
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పుడు కేంద్రం ప్రత్యేక సెషన్‌గా అని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

    సభా కార్యక్రమాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి.

    ఈ సెషన్‌లో నాలుగు బిల్లులను పరిశీలించాలని కేంద్రం యోచిస్తోంది.

    అలాగే జీ20 సదస్సు విజయవంతం కావడం, చంద్రయాన్-3 సాఫ్ట్-ల్యాండింగ్, 'వన్ నేషన్ వన్ ఎలక్షన్', దేశం పేరును 'భారత్'గా మార్చే అంశాలపై చర్చించవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

    కేంద్రం

    ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ ఇదే 

    పాత పార్లమెంట్ హౌస్‌లో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

    సెప్టెంబర్ 19న పాత పార్లమెంట్ హౌస్‌లోనే ఫొటో సెషన్ ఉంటుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది.

    ఆ తర్వాత ఉభయ సభల ఎంపీ కొత్త పార్లమెంటు భవనానికి చేరుకుంటారు. సెప్టెంబరు 19 నుంచి కొత్త భవనంలో సమావేశాలు కొనసాగనున్నాయి.

    ఆదివారం (సెప్టెంబర్ 17) ఉదయం కొత్త పార్లమెంటు భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

    కొత్త పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులకు ఇప్పటికే గదుల కేటాయింపు జరిగింది. వారికి సమాచారం కూడా అందించారు. ఇందులో పై అంతస్తు, మొదటి అంతస్తులో మంత్రులకు గదులు కేటాయించారు.

    కేంద్రం

    ఏయే అంశాలపై చర్చిస్తారు, ఏయే బిల్లులు ప్రవేశపెడతారు?

    ప్రత్యేక సమాశాల్లో చర్చించే అంశాలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే తాత్కాలిక ఎజెండాను విడుదల చేసింది.

    అందులో 75 సంవత్సరాల పార్లమెంటు ప్రయాణం గురించి చర్చించనున్నట్లు కేంద్రం చెప్పింది. అలాగే పార్లమెంటు పర్యటనలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న విషయాలపై ప్రత్యేక చర్చ జరగనుంది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన నిబంధనలతో కూడిన బిల్లు కూడా ఆమోదం కోసం ఎజెండాలో చేర్చారు. వర్షాకాల సమావేశాల్లో దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

    న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్, జర్నల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు 2023ను చర్చించే జాబితాలో చేర్చారు.

    పోస్టాఫీస్ బిల్లు 2023ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును 10 ఆగస్టు 2023న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

    కేంద్రం

    ఇప్పటి వరకు ఏడుసార్లు ప్రత్యేక సమావేశాలు 

    వాస్తవానికి రాజ్యాంగంలో 'ప్రత్యేక సెషన్' అనే ప్రస్తావన లేదు. అయితే ముఖ్యమైన శాసనాలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన సంఘటనలు, పరిస్థితులలో రాష్ట్రపతి ఆదేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలకు పిలువొచ్చు.

    ప్రత్యేక సెషన్‌లో ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించడం తప్పనిసరి కాదనే నియమం ఉంది.

    ఇప్పటి వరకు ఏడుసార్లు ప్రత్యేక సమావేశాలు జరిగాయి.

    వీటిలో 1977లో మొదటి ప్రత్యేక సెషన్, 1991లో రెండో సెషన్, 1992లో మూడో సెషన్, 1997లో నాల్గవ సెషన్, 2008లో ఐదో సెషన్, 2015లో ఆరో సెషన్, 2017లో ఏడో సెషన్ నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    తాజా వార్తలు
    లోక్‌సభ
    రాజ్యసభ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ

    తాజా వార్తలు

    'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు  చంద్రబాబు నాయుడు
    Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి  రాజస్థాన్
    అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ  ప్రియాంక గాంధీ
    CDC: అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్  కరోనా వేరియంట్

    లోక్‌సభ

    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం నరేంద్ర మోదీ

    రాజ్యసభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025