NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు 
    తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు

    తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 21, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మరో నూతన రాజకీయ పార్టీ పుట్టింది. ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

    ఇందులో భాగంగానే గద్దర్ ప్రజా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

    ఈ మేరకు కొత్త పార్టీని రిజిస్టర్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

    సీఈసీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు.

    77 ఏళ్ల వయసులో ప్రజా పార్టీ ఏర్పాటు చేశానని, ఇది ప్రజల తరఫున నిలిచే పార్టీ అని గద్దర్ స్పష్టం చేశారు.

    ఈ దేశం, రాజ్యాంగం ప్రకారమే నడవాలని ఆయన ఆకాంక్షించారు.

    DETAILS

    దొరల పాలన పోయి ప్రజల పాలన రావాలి: గద్దర్ 

    ఈ సందర్భంగా బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ పై గద్దర్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కాలేదన్నారు.

    రాష్ట్రాన్ని కేసీఆర్ పుచ్చిపోయిన తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ తెచ్చి రాష్ట్రంలోని భూములు మింగారని ఆందోళన వ్యక్తం చేశారు.

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు గడిచినా, ప్రజలు ఆశించిన రీతిలో పరిపాలన సాగలేదన్నారు.

    రాష్ట్రంలో దొరల పరిపాలన మాత్రమే జరుగుతోందని, ప్రజా పాలన సాగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    జీవించే హక్కు సైతం లేకుండా పోయిందన్న గద్దర్, దొరల పాలన పోయి ప్రజల పాలన రావాలని ప్రజాపార్టీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

    DETAILS

    నా వెనుక కోట్లాది మంది ప్రజా బలం ఉంది : గద్దర్

    ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజల వద్దకే వెళ్తున్నట్లు గద్దర్ అన్నారు. రాష్ట్రంలోని పల్లె పల్లెకు వెళ్తానని, పార్టీ నిర్మాణం చేస్తానన్నారు.

    ప్రజల జెండానే తన ఎజెండా అని, ఓటు ప్రలోభాల నుంచి ఓటర్ ను కాపాడటమే తన లక్ష్యమని వివరించారు.

    రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానన్న గద్దర్ , తన పార్టీ ఎవరితో కలవాలి, ఎలా వెళ్లాలనే అంశంపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఎన్నికల సంఘం

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    తెలంగాణ

    తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని హైదరాబాద్
    తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ విద్యా శాఖ మంత్రి
    తెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్ ప్రభుత్వం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ లోక్‌సభ
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025