NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రేపు రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
    తదుపరి వార్తా కథనం
    రేపు రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
    వందేభారత్ కోచ్‌లు తయారు చేస్తున్న మేధా

    రేపు రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 21, 2023
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మెట్రో కోచ్‌లు తయారు చేస్తున్న మేధా సర్వో గ్రూప్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.

    రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామ సమీపంలో రైల్వేకోచ్‌ పరిశ్రమ రానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీగా ఇది పేరుగాంచింది.

    సుమారు రూ.1000 కోట్ల మెగా పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటుకు గతంలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.

    ఈ పరిశ్రమ నిర్మాణానికి 2020 ఆగస్టు 13న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. తాజాగా 25 ఎకరాల్లో నిర్మాణాలు ప్రారంభిస్తూ ప్రాథమికంగా కోచ్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు.

    DETAILS

    వందే భారత్‌ రైళ్లకు భోగీలను అందిస్తున్న మేధా సర్వో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

    వందే భారత్‌ రైళ్లకు కావాల్సిన బోగీలను ఈ సంస్థే తయారు చేసి రైల్వేశాఖకు అందిస్తోంది.

    అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్న 2 వందే భారత్‌ రైళ్లకు ఇక్కడ తయారు చేసిన కోచ్ లనే బిగించారు.

    ఈ క్రమంలో మొత్తంగా 160 బోగీలను రైల్వేకు తమ కంపెనీ సరఫరా చేసిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరో 75 ఎకరాల్లో వ్యాగన్ల తయారీ యూనిట్‌ ను సైతం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

    మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను స్పెషల్ సీఎస్ అర్వింద్‌ కుమార్‌, సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు పరిశీలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు అంబర్‌పేట్
    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ అసదుద్దీన్ ఒవైసీ
    నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ

    తెలంగాణ

    హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం కాంగ్రెస్
    తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో నరేంద్ర మోదీ
    తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని హైదరాబాద్
    తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ విద్యా శాఖ మంత్రి

    ప్రభుత్వం

    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు తెలంగాణ
    కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు
    ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు ధర
    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025