NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి..  బీజేపీలో కెఆర్‌పిపి విలీనం  
    తదుపరి వార్తా కథనం
    Karnataka: బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి..  బీజేపీలో కెఆర్‌పిపి విలీనం  
    బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి.. బీజేపీలో కెఆర్‌పిపి విలీనం

    Karnataka: బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి..  బీజేపీలో కెఆర్‌పిపి విలీనం  

    వ్రాసిన వారు Stalin
    Mar 25, 2024
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

    కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు.

    మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో ఆయన తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కెఆర్‌పిపి)ని బీజేపీలో విలీనం చేశారు.

    ఆయనతో పాటు ఆయన భార్య కూడా పార్టీ కండువా కప్పుకుని బీజేపీలో చేరారు.

    ఈ సందర్భంగా గాలి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీని బీజేపీలో విలీనం చేసి తానే స్వయంగా ఆ పార్టీలో చేరానన్నారు.

    నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యేలా బీజేపీ కార్యకర్తగా పని చేస్తానని నిబద్ధత వ్యక్తం చేశారు.

    డీటైల్స్ 

    28 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంటుంది: యడ్యూరప్ప

    ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, పార్టీలో ఎలాంటి పదవుల కోసం తాను ఆశించడం లేదని స్పష్టం చేశారు.

    అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డి దంపతులు బీజేపీలో చేరడం సానుకూల నిర్ణయమని, రెడ్డి చేరిక వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

    రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

    ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కర్ణాటక

    GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు  జీఎస్టీ
    Karnataka: చిక్కబల్లాపూర్‌లో జికా వైరస్ నిర్ధారణ,ప్రభుత్వం హై అలర్ట్  భారతదేశం
    Karnataka : కర్ణాటకలో ఘోరం.. హత్యకు గురైన అధికారిణి.. దిగ్భ్రాంతిలో సహోద్యోగులు హత్య
    Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025