NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Minister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
    తదుపరి వార్తా కథనం
    Minister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
    గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?

    Minister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 06, 2025
    04:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఒక ఘటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

    MSME పార్క్ పనుల శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    ఈరోజు జరిగిన MSME మీటింగ్ సందర్భంగా, కార్యక్రమం అనంతరం నాయకులతో ఫోటోలు దిగేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానికులు వేదికపైకి ఎగబడిన నేపథ్యంలో సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.

    అయితే సకాలంలో సిబ్బంది స్పందించడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అధికారులతో పాటు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

    Details

    MSME పార్క్ పనులకు శంకుస్థాపన

    ఇంతకు ముందు రూ. 12.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన MSME పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు.

    ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా గంటా శ్రీనివాసరావు స్పందించారు.

    పద్మనాభం మండలంలోని కృష్ణాపురంలో MSME పార్క్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించానని చెప్పారు.

    ఉత్తరాంధ్రలో తొలి MSME పార్క్ అని, మొదటి దశలో 21.72 ఎకరాల్లో 163 ప్లాట్లు ఏర్పాటు చేశారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 12.40 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

    ఈ పార్క్ పూర్తిగా అభివృద్ధి అయితే వేలాది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    విశాఖపట్టణం

    Visakha Metro Rail: విశాఖ 'మెట్రో' మొదటి దశ డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం మెట్రో రైలు
     Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు విమానం
    Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు నౌకాదళం
    Visakha Cruise Terminal: పూర్తి హంగులతో సిద్ధమైన విశాఖ క్రూజ్‌ టెర్మినల్‌..   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025