NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి
    తదుపరి వార్తా కథనం
    యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి
    యూపీలో తీవ్ర విషాదం

    యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు.దీంతో నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో కన్నుమూశాడు.

    విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన యాకూబ్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.14 ఏళ్ల కుమారుడు షావాజ్, ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

    నెల రోజుల క్రితం ఇంటి పక్కన ఆడుకుంటుండుగా ఓ పెంపుడు కుక్క షావాజ్‌ ను కరిచింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తిడతారని ఎవరికీ చెప్పలేదు.

    సెప్టెంబర్ 1న బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.ఆహారం కూడా సరిగ్గా తినకుండా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు కుటుంబం గుర్తించింది.

    DETAILS

    అంబులెన్స్‌లోనే  తండ్రి ఒడిలో ప్రాణం విడిచిన బాలుడు షావాజ్ 

    కొన్నిసార్లు బాలుడు కుక్క మొరిగినట్లుగా శబ్దాలు చేసేవాడని పసిగట్టిన కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

    కొంతకాలం క్రితం కుక్క కాటుకు గురైన కారణంగా ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించిందని వైద్యులు నిర్థారించారు.

    బాలుడికి వ్యాధి నయం కావాలని కుటుంబ సభ్యులు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కుదురుకోలేదు.

    అలా పలు ఆస్పత్రుల్లో చూపిస్తున్న క్రమంలో షావాజ్ అంబులెన్స్‌లోనే తండ్రి ఒడిలో ప్రాణం విడిచాడు.

    దీంతో పెను విషాదం చోటు చేసుకుంది. తీవ్ర శోకంతో బాధిత తండ్రి తన కుమారుడు మరణించాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

    తన కొడుకును తన పక్క ఇంటి వద్ద ఉండే కుక్క బలి తీసుకుందని విలపించారు. సదరు కుక్కను పెంచుకునే ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం డిమాండ్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు

    ఉత్తర్‌ప్రదేశ్

    గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత  తాజా వార్తలు
    కమిషనర్ కుక్క కోసం ఇంటింటిని జల్లెడపడుతున్న పోలీసులు  మున్సిపల్ కమిషనర్
     ఉత్తర్‌ప్రదేశ్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు తుపాకీ కాల్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025