NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు
    తదుపరి వార్తా కథనం
    Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు
    ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 30, 2024
    10:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో పెట్టుబడిదారుల సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో భాగస్వామ్యంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై నేరుగా చర్చించడానికి కన్సల్టేటివ్ ఫోరంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఇటీవల విజయవాడలో జరిగిన సీఐఐ సదస్సులో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేశ్ తో సీఐఐ ప్రతినిధులు ఫోరంను ఏర్పాటు చేయాలని కోరారు.

    ఆ మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫోరాన్ని ఏర్పాటు చేసింది.

    ఈ ఫోరంలో మంత్రి నారా లోకేష్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు, అలాగే వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

    Details

    సీఐఐతో కలిసి పనిచేయాలని నిర్ణయం

    ఈ ఫోరంను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ 2050 నాటికి ప్రపంచంలో ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయివేటు రంగంతోనూ సమన్వయం చేసుకోవడానికి సీఐఐతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకుంది.

    పరిశ్రమల అభివృద్ధికి అనుమతులను త్వరితగతిన ఒకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా ఇవ్వనుంది. ఏపీ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ కార్యాలయంలోని ప్రజా వేదికకు ప్రతి రోజు ఫిర్యాదులు అందజేస్తున్నారు.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు.

    ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో 60-70% రెవెన్యూ సమస్యలే కావడంతో, గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా లోకేశ్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    నారా లోకేశ్

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: ఏపీలో పోలీసులకు రక్షణ కరువు.. మహిళా పోలీసు డ్రెస్ లాగడంపై మండిపడ్డ చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం భారతదేశం
    Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా
    New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025