NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!
    రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!

    Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2025
    10:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

    ఈ నేపథ్యంలో ఇవాళ లేదా రేపటి నుండి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఇదివరకే ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

    సుమారు 17 లక్షల మంది ఎకరం భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

    తాజాగా రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా నిధులను జమ చేయనుంది.

    Details

    ప్రతి ఏటా ఎకరానికి రూ.12వేలు

    తెలంగాణ సర్కారు ఇటీవలే 'రైతు భరోసా', 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా', 'రేషన్ కార్డులు', 'ఇందిరమ్మ ఇండ్ల పథకాలు' ప్రారంభించింది.

    అయితే వీటిని వేర్వేరుగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇందులో భాగంగా 'రైతు భరోసా' కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రతి ఏటా ఎకరానికి రూ. 12,000 చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

    తొలి విడతగా ప్రస్తుతం అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6,000 జమ చేస్తోంది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం కింద, మొదటిగా 563 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

    Details

    రెండు ఎకరాల భూమి ఉన్న రైతు ఖాతాల్లోకి 'రైతు భరోసా'

    రెండో విడతలో ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది.

    ఇప్పుడు రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనూ 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

    రైతులకు రెండు విడతల్లో ఎకరాకు రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

    ప్రస్తుతం ఎకరానికి రూ. 6,000 చొప్పున అందిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో 563 గ్రామాల్లో నిధులు విడుదల చేయగా, ఇటీవల ఒక ఎకరం భూమి కలిగిన అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 6,000 చొప్పున నిధులు జమ చేశారు.

    Details

    రూ.1,126 కోట్లు జమ

    మొత్తం జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు 21,45,330 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 1,126 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు వెల్లడించింది.

    'రైతు భరోసా' నిధులను దశలవారీగా మార్చి 31 వరకు అర్హులైన రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

    తాజాగా, ఒక ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఇవాళ లేదా రేపటి నుండి రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల

    తెలంగాణ

    Telangana: ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య 11 రేడియల్‌ రోడ్లపై ప్రభుత్వం కసరత్తు భారతదేశం
    Uttam Kumar Reddy: రేషన్‌ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ ప్రకటన ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    TG High Court: తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తుల నియామకం హైకోర్టు
    Telangana: తెలంగాణలో నూతన AI డేటా సెంటర్.. రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 3600 ఉద్యోగాలు టెక్నాలజీ

    రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సమావేశం  తెలంగాణ
    Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ
    Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత తెలంగాణ
    Revanth Reddy: ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025