NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు
    తదుపరి వార్తా కథనం
    Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు
    రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు

    Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 29, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది.

    ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు.

    ఉచిత రేషన్ పథకం గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ మరో 5 ఏళ్లు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

    ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని ఆయన పేర్కొన్నాడు.

    జనవరి 1, 2024 నుంచి ఈ పొడిగింపు వర్తిస్తుందన్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందనున్నారు.

    Details

    ఐదేళ్ల పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

    గత ఛత్తీస్ గఢ్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

    తాజాగా దీనికి కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. పీఎంజీకేఓవై పథకాన్ని ఏప్రిల్ 2020లో కరోనా మహమ్మారి లాక్ డౌన్ విధించిన క్రమంలో కేంద్రం ప్రకటించింది.

    మొదట మూడు నెలలు మాత్రమే ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత పలుమార్లు ఈ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

    ఇప్పుడు ఏకంగా మరో ఐదేళ్లు పాటు ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

    డిసెంబర్ 2028 వరకు ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    నరేంద్ర మోదీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    కేంద్ర ప్రభుత్వం

    దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఎన్నికలు
    రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా జీఎస్టీ
    సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ విద్యా శాఖ మంత్రి
    అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత  భారతదేశం

    నరేంద్ర మోదీ

    మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు  మణిపూర్
    ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ  ఇజ్రాయెల్
    PM Modi : ఉగ్రవాదంపై పోరుకు కొన్ని దేశాలు కలిసి రాకపోవడం బాధాకరం ప్రధాన మంత్రి
    Garbo Song : దేశంలో శరన్నవరాత్రుల సందడి.. మోదీ రాసిన 'గర్బా' పాట విడుదల ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025