NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు
    చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు

    Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకురావాలని ప్రతిపాదించిన 'క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌' పథకం కింద చిన్న పరిశ్రమలకు లభించాల్సిన లబ్ధులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

    కేంద్రం నుండి ఈ నిధి కోసం రూ.900 కోట్లు అందుతాయని ఆయన వివరించారు.

    సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) కొరకు కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా రుణాలు అందించడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు సహాయం అందించడం ఈ నిధి లక్ష్యం అని ఆయన చెప్పారు.

    వివరాలు 

    ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహానికి త్వరలో కొత్త విధానం 

    సచివాలయంలో గురువారం జరిగిన సమీక్షలో, సీఎం చంద్రబాబు ఎంఎస్‌ఎంఈలు, ఫుడ్‌ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై చర్చించారు.

    ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహానికి త్వరలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామన్నారు.

    రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రానున్న వారికి ప్రాథమిక సమాచారం అందించడానికి టీసీఎస్‌ రూపొందించిన 'ఎంఎస్‌ఎంఈ వన్‌' యాప్‌ను రెండు నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా చేస్తున్నామన్నారు.

    ఈ యాప్ ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం, జిల్లాలో పరిశ్రమల అవకాశాలు, మార్కెటింగ్‌ సదుపాయాలు వంటి వివరాలను అందిస్తామన్నారు.

    వివరాలు 

    ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులు 

    ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులు అభివృద్ధి చేయాలని,మొత్తం 50 పార్కులను రంగాల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

    ఏపీఐఐసీ నిధులతో అభివృద్ధి చేసిన పార్కుల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో చిన్న పరిశ్రమలకు ఇబ్బందిగా మారినట్లు చెప్పారు.

    పబ్లిక్,ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రతి నియోజకవర్గంలో మరో 50పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తామని,మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కొంత నిధిని అందిస్తుందని వివరించారు.

    డ్వాక్రా సంఘాలను ఎంఎస్‌ఎంఈలు ప్రారంభించడానికి ప్రోత్సహిస్తామని కూడా చెప్పారు.

    రాష్ట్రంలో చిన్న పరిశ్రమల డేటా బ్యాంక్‌ను కేంద్రమే సాయంతో 'ర్యాంప్' కార్యక్రమాన్ని అక్టోబరు 2న ప్రారంభిస్తామని,ప్రతి జిల్లాలో ఎంఎస్‌ఎంఈలను రిజిస్టర్‌ చేయాలని,ఇందుకోసం సచివాలయంలో ఇండస్ట్రియల్‌ అసిస్టెంట్‌ సహకారంతో'ఉద్యమ్‌ సర్టిఫికెట్‌'అందుబాటులోకి తెస్తామని, వ్యాపారాభివృద్ధికి నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు.

    వివరాలు 

    అమరావతిలోనే టెక్నాలజీ సెంటర్‌ 

    అమరావతిలో టెక్నాలజీ సెంటర్‌ను తిరిగి ఏర్పాటు చేస్తామని, కేంద్రం 10 అనుబంధ యూనిట్లను అందిస్తుందని చెప్పారు.

    ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు ఆన్‌ జాబ్‌ శిక్షణ అందిస్తామని, ఫార్మా, అగ్రికల్చరల్‌ ప్రాసెసింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆటోమొబైల్‌ టెక్నాలజీ రంగాల్లో శిక్షణ ఇస్తామని వివరించారు.

    కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కనీసం 100 కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ)లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, విజయవాడలో డెవలప్‌మెంట్‌ ఫెసిలిటేషన్‌ ఆఫీసర్‌ (డీఎఫ్‌వో) కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: నా కాళ్ళు మొక్కితే.. నేను మీ కాళ్లు మొక్కుతా: చంద్రబాబు నాయుడు   భారతదేశం
    Chandrababu : సహజ వనరుల దోపిడీకి గత సర్కార్ పాల్పడిందన్న చంద్రబాబు.. ఇవాళ శ్వేతపత్రం విడుదల భారతదేశం
    ChandraBabu: ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు మోడీ జీ... బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: మద్యం పాలసీలో కుంభకోణం.. జగన్ పై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025