
Raja Singh: బీజేపీకి గుడ్బై.. రాజాసింగ్ సంచలన నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీపై తీవ్ర అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రకటన చేయడం గమనార్హం. రాష్ట్ర అధ్యక్షుడిగా బస్సా రాంచందర్ రావును నియమించడాన్ని రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. అధ్యక్ష పదవికి తనను ఎదురయ్యేలా చేయకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. నాకు నామినేషన్ వేయాలనిపించింది. కానీ నా మద్దతుదారులను బెదిరించారు. నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. పార్టీ అధిష్ఠానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.
Details
బీజేపీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డా
వాళ్లు అనుకున్నవారికే పదవులు వచ్చాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో కష్టపడ్డాం. కానీ బీజేపీలోనే చాలామందికి అది ఇష్టంలేదు. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల లక్ష్యంగా మారాం. అయినా పార్టీ కోసం ఎంత చేశాం? చివరకు ఏమీ లాభం లేకుండా పోయింది. అందుకే పార్టీకి లవ్ లెటర్ (రాజీనామా లేఖ) ఇచ్చి వెళ్తున్నా. మీ పార్టీకి దండం అని ఉద్వేగంతో మాట్లాడారు. బీజేపీ నుంచి తప్పుకున్నా.. హిందుత్వం కోసం నా పోరాటం మాత్రం కొనసాగుతుంది. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనను గెలిపించిన పార్టీ గుర్తుకు సంబంధించి ఇప్పుడు స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.