NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MLC Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్
    తదుపరి వార్తా కథనం
    MLC Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్
    MLC Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్

    MLC Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్

    వ్రాసిన వారు Stalin
    May 27, 2024
    06:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో వరంగల్ - నల్గొండ -ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది.

    మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    కాగా ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని బిజెపి నేతలు ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

    ఇందుకు తగిన నగదు విత్ డ్రా చేసిన ఆధారాలను సమర్పించారు.

    ఉమ్మడి వరంగల్ - నల్గొండ - ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC Elections)ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది.

    ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

    Details 

    దాదాపు 60 శాతం పోలింగ్

    క్యూలైన్లలో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు.

    మధ్యాహ్నం 2 గంటల వరకూ 49.53 శాతం పోలింగ్ నమోదు కాగా.. 4 గంటల వరకూ దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

    ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సాగింది.

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనితో .. ఉప ఎన్నిక అనివార్యమైంది.

    Details 

    3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు

    52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఏనుగల రాకేష్‌రెడ్డి పోటీలో నిలిచారు.

    వీళ్లతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల విధానాలను వ్యతిరేకించే వాళ్లంతా కూడా స్వతంత్రంగా బరిలో నిలబడ్డారు.

    ఈ ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం  సుప్రీంకోర్టు
    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్
    Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత అమెరికా

    తెలంగాణ

    US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి  అమెరికా
    Telangana: తెలంగాణలో శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు  భారతదేశం
    BRS And BSP Alliance: పొత్తు ఖరారు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు కేటాయించిన బీఆర్ఎస్  భారతదేశం
    Pasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025