NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ
    తదుపరి వార్తా కథనం
    Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ
    గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ

    Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    08:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    అధికారులు అభ్యర్థుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలతో పాటు, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

    ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేశారు. ఈసారి గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.

    హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    2011 తర్వాత మళ్ళీ నిర్వహిస్తున్న ఈ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి సీసీటీవీ పర్యవేక్షణతో అన్ని పరీక్షా హాల్స్‌ లో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు.

    Details

    దివ్యాంగులకు అదనంగా ఓ గంట సమయం కేటాయింపు

    పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

    అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం 1:30 తర్వాత కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించరాదని అధికారులు స్పష్టం చేశారు.

    పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే దివ్యాంగులకు అదనంగా ఒక గంట సమయాన్ని కేటాయించారు.

    ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్యసదుపాయాలతో పాటు, అన్ని కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు. పరీక్షల వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం కరీంనగర్
    Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ వర్షాకాలం
    Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు ఇండియా
    Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్

    హైదరాబాద్

    National Engineers Day 2024: ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకత.. సాంకేతిక ఆవిష్కరణలకు స్ఫూర్తిదాయక నేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య  జీవనశైలి
    Brutal murder: హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య హత్య
    Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు భారతదేశం
    heart attack: హైదరాబాద్‌లో విషాదం.. వేలంలో లడ్డూను దక్కించుకున్న యువకుడు గుండెపోటుతో మృతి  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025