NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?
    తదుపరి వార్తా కథనం
    Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?
    హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?

    Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 07, 2024
    10:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 90 శాసనసభ స్థానాలకు మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

    బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉండగా, కాంగ్రెస్‌ ఈసారి విజయం తమదేనని నమ్ముతోంది.

    ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా కాంగ్రెస్‌ విజయాన్ని ఊహించాయి. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు.

    వివరాలు 

    67.90 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు

    మంగళవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేయబడింది.

    ఈసారి కూడా బీజేపీ తన విజయాన్ని హ్యాట్రిక్‌గా మలుచుకుంటుందా లేదా కాంగ్రెస్‌ మార్పును తీసుకురాగలదా అనేది ఆసక్తికరంగా మారింది.

    మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలకు అక్టోబర్‌ 5న పోలింగ్‌ జరగ్గా, 67.90 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.

    వివరాలు 

    విజయం ఎవరిదో? 

    ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ లాడ్వా నుంచి, ప్రతిపక్ష నేత భూపీందర్‌ సింగ్‌ హుడ్డా గర్హి సంప్లా-కిలోయ్ నుంచి పోటీ చేశారు.

    రెజ్లర్‌ వినేష్ ఫొగట్‌ కాంగ్రెస్‌ తరఫున జులానా నుంచి పోటీచేశారు. సీఎం సైనీ బీజేపీ మూడోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండగా, మాజీ సీఎం హుడ్డా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

    ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమి, జేజేపీ నేత దుశ్యంత్‌ చౌతాలా తమకూ అనుకూలంగా ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు.

    ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా హరియాణాలో తమ మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని పేర్కొంది.

    వివరాలు 

    2019లోని ఫలితాలు 

    2019 ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్‌ 28 స్థానాలు, జేజేపీ 6 స్థానాలు సాధించాయి.

    ఐఎన్‌ఎల్‌డీ, హరియాణా లోక్‌హిత్‌ పార్టీ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. బీజేపీ జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

    అయితే, 2024లో బీజేపీ కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీని నియమించడంతో జేజేపీ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    హర్యానా

    Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్  దిల్లీ
    Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం దిల్లీ
    Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్ దిల్లీ
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025