NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Damodar Raja Narasimha: కొవిడ్‌తో ముప్పు లేదు.. అప్రమత్తత అవసరం.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దామోదర్‌
    తదుపరి వార్తా కథనం
    Damodar Raja Narasimha: కొవిడ్‌తో ముప్పు లేదు.. అప్రమత్తత అవసరం.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దామోదర్‌
    కొవిడ్‌తో ముప్పు లేదు.. అప్రమత్తత అవసరం.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దామోదర్‌

    Damodar Raja Narasimha: కొవిడ్‌తో ముప్పు లేదు.. అప్రమత్తత అవసరం.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దామోదర్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 27, 2025
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

    ప్రస్తుతం కొవిడ్‌ వల్ల ముప్పు కనిపించకపోయినా,జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం నమూనాలను పరీక్షించాలని ఆయన వెల్లడించారు.

    సోమవారం నాడు మంత్రి సచివాలయంలో ఓ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

    ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా,సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్ డయాగ్నొస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్,ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ సుదీప్ ఘోష్,నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ప్రజారోగ్య సంచాలకుడు రవీందర్ నాయక్ తదితరులు హాజరయ్యారు.

    వివరాలు 

    ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగే అవకాశం

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వల్ల భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంగా తెలిపారు.

    దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు కనిపిస్తున్నప్పటికీ,బాధితులు ఆసుపత్రుల్లో చేరే స్థితిలో లేరని తెలిపారు.

    అయితే,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    కొవిడ్ వైరస్‌కు సంబంధించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపాలని సీసీఎంబీ మరియు సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు మంత్రిని కోరగా,ఆ మేరకు అవసరమైన నమూనాలను పంపించాలని డీహెచ్‌ రవీందర్ నాయక్‌ను మంత్రి ఆదేశించారు.

    అలాగే,రాష్ట్రంలో వర్షాలు మొదలవ్వడం వల్ల సీజనల్‌ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని,దీనితో ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున,అన్ని రకాలుగా ముందస్తుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    తెలంగాణ

    Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత హైకోర్టు
    Telangana: రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం భారతదేశం
    TGSRTC Strike: తెలంగాణలో బస్సులు బంద్‌.. అర్థరాత్రి నుంచి RTC సమ్మె ప్రారంభం! భారతదేశం
    TGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025