Page Loader
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ

Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2024
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల్లో 400 గ్రామాలు నీటమునిగిపోగా, వేలాది మంది ప్రజలు తమ ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వరదల కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ విపత్తు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీ మాట్లాడారు. వరదల పరిస్థితులపై వివరాలు తెలుసుకుని, రెండు రాష్ట్రాలకు కేంద్రం తరఫున అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Details

61 వైద్య శిబిరాలు ఏర్పాటు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, బుడ్మేరు వాగు పొంగడంతో పరిస్థితి దారుణంగా మారిందని, వేలాది మంది ప్రజలు ఇళ్లపై చిక్కుకుపోయారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, బోట్ల ద్వారా ఆహారంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 100 సహాయ, పునరావాస కేంద్రాలు, 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.