Page Loader
Kurnool -High Court: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Kurnool -High Court: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై హైకోర్టు న్యాయమూర్తులు (ఫుల్‌ కోర్ట్‌) అభిప్రాయాలను పొందేందుకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేపట్టేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల డిమాండ్‌ రాయలసీమ ప్రజలు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదట రాజధానిగా కర్నూలు ఉండేది. ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో హామీ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి, కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వివరాలు 

ఇతర రాష్ట్రాల్లో బెంచ్‌లు 

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయి. ఉదాహరణకు మద్రాసు హైకోర్టుకు మదురై, బాంబే హైకోర్టుకు నాగపూర్‌, ఔరంగాబాద్‌ వంటి ప్రాంతాల్లో బెంచ్‌లు ఉన్నాయి. రాయలసీమ ప్రజల ఇబ్బందులు రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్టు నేరుగా చేరేందుకు ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు ఉన్నాయి. కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా రైలు సౌకర్యం లేకపోవడం, వైఎస్సార్‌ జిల్లాలోనూ ప్రయాణానికి పరిమిత రైలు సేవలు ఉండడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

వివరాలు 

నివేదిక సమర్పణ 

హైకోర్టు కాంపిటెంట్‌ అథారిటీ ముందు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ అవసరంపై నివేదిక సమర్పించాలని న్యాయశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ నుంచి వచ్చే కేసుల సంఖ్య, వివిధ రకాల కేసుల పని భారాన్ని విశ్లేషించి, వీటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదన అమలవడంతో రాయలసీమ ప్రజలకు న్యాయసేవలు చేరువ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.