NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం
    ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం

    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 03, 2025
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఆధారంగా జూన్ 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.

    డీఎస్సీ పరీక్షల నిర్వహణను నిలిపివేయడానికి సహేతుక కారణాలు లేవని పేర్కొంటూ, ఈ అంశంపై అత్యవసర విచారణ (హౌజ్‌మోషన్) నిర్వహించిన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా,డీఎస్సీ పరీక్షల తుదిదశ ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో స్టే ఇవ్వలేమని పేర్కొన్న న్యాయస్థానం..ఇప్పటికే హాల్‌ టికెట్లు జారీ కావడం, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తవడం వంటి అంశాలను గుర్తుచేసింది.

    ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.

    Details

    పిటిషన్ల వివరాలు

    1. టెట్ నిర్వహణపై అభ్యంతరం

    2011లో జారీ చేసిన జీవో-51 ప్రకారం విద్యా సంవత్సరానికి రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమని చిత్తూరు జిల్లాకు చెందిన పి. ప్రభాకర్ తదితరులు పిటిషన్ దాఖలు చేశారు.

    2. వయోపరిమితిపై అభ్యంతరం

    ఫిబ్రవరి 12న విడుదలైన డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌కు వయస్సు పరంగా అర్హులమని, కానీ ఏప్రిల్ 20న విడుదలైన తాజా నోటిఫికేషన్ ప్రకారం అనర్హులమయ్యామని కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు.

    2024 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వారిని ప్రస్తుత డీఎస్సీకి అర్హులుగా గుర్తించాలని వారు కోరారు.

    Details

    3. భాష అర్హతపై అభ్యంతరం 

    సీబీఎస్‌ఈ పదో తరగతిలో మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగును చదివిన అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించడాన్ని ఎమ్మిగనూరుకు చెందిన వెలికంటి సాంబశివ వ్యాజ్యం ద్వారా సవాల్ చేశారు.

    4. బీఈడీ చివరి సంవత్సరం విద్యార్థుల అర్హతపై అభ్యంతరం

    ప్రస్తుతం బీఈడీ చివరి సంవత్సరం చదివే అభ్యర్థులను డీఎస్సీ నుంచి మినహాయించడం చట్ట విరుద్ధమని కొన్ని వ్యాజ్యాలు వేశారు.

    45 రోజుల షెడ్యూల్ సరిపోదని అభిప్రాయపడ్డారు.

    Details

    ప్రభుత్వ వాదనలు

    పాఠశాల విద్యాశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌. ప్రణతి పలు కీలక వాదనలు వినిపించారు

    వయో పరిమితి పెంచాలని కోరుతున్న వారికి 2024 డీఎస్సీ నాటికే అర్హత లేదని పేర్కొన్నారు.

    సీబీఎస్‌ఈ అభ్యర్థులలో చాలామంది మొదటి భాషగా ఆంగ్లాన్ని చదివినా.. నిర్ధిష్ట పోస్టులకు తప్ప మిగిలిన వాటికి వారు అర్హులేనన్నారు.

    ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేసినందున పిటిషన్లను కొట్టేయాలని కోరారు.

    న్యాయస్థాన వ్యాఖ్యలు

    ఏడాదికి ఒకసారి టెట్ నిర్వహించడమే సరిపోతుందని ప్రభుత్వం జీవోలో పేర్కొన్నట్లు గుర్తుచేశారు.

    పరీక్షలకు 90 రోజుల సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

    బీఈడీ చివరి సంవత్సరం అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్లకూ న్యాయమూర్తి అనుమతిని నిరాకరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం హైకోర్టు
    Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ ఆస్ట్రేలియా
    Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు! విరాట్ కోహ్లీ
    Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి అమెరికా

    హైకోర్టు

    Actor Darshan: అభిమాని హత్య కేసులో దర్శన్‌కు మధ్యంతర బెయిల్  కోలీవుడ్
    Darshan : చికిత్స కోసం బెంగళూరులో దర్శన్.. అభిమానులతో తూముకూరులో ఉద్రిక్తతలు కోలీవుడ్
    Allu Arjun: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. అల్లు అర్జున్‌పై నమోదైన కేసు కొట్టివేత అల్లు అర్జున్
    Telangana High Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు రిజర్వు తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ అమరావతి
    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు! శ్రీశైలం
    New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు! భారతదేశం
    Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025