Page Loader
Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ
అరవింద్ కేజ్రీవాల్‌కు వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ

Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2024
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వ వసతి కేటాయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై హైకోర్టు నవంబర్ 26న విచారణ చేపట్టనుంది. సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్, అక్టోబర్ 4న తన అధికార నివాసం ఖాళీ చేశారు. ప్రస్తుతం ఫిరోజ్‌షా రోడ్‌లోని 5వ నంబర్ బంగ్లాలో నివసిస్తున్నారు. అయితే ఈ బంగ్లా పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు కేటాయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకారం, కేజ్రీవాల్‌కు దిల్లీలో సొంత నివాసం లేకపోవడంతో ప్రభుత్వ వసతి కేటాయించాలని కోరుతున్నారు.

Details

బీజేపీ దాడులకు పాల్పడుతోంది

ఆప్ జాతీయ పార్టీ కావడంతో, దాని జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్ ప్రభుత్వ వసతి పొందాల్సిన అర్హత కలిగి ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇతర జాతీయ పార్టీల అధ్యక్షులకు లభించే వసతులు కేజ్రీవాల్‌కూ ఇవ్వాలన్న ఆప్ వాదనతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల మధ్య, బీజేపీ తమ నేతపై దాడికి పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. వికాస్‌పురిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కేజ్రీవాల్‌పై దాడి జరిగిందని, ఈ దాడి బీజేపీ కుట్రగా ఆప్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ కేసు పరిణామాలు దిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.