NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala: కేరళలో న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్‌ ఏర్పాటు!
    తదుపరి వార్తా కథనం
    Kerala: కేరళలో న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్‌ ఏర్పాటు!
    కేరళలో న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్‌ ఏర్పాటు!

    Kerala: కేరళలో న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్‌ ఏర్పాటు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలో అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి.

    ఈ విషయంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణన్‌కుట్టి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఇటీవల జరిగిన చర్చలలో పాల్గొన్నట్లు తెలిపాయి.

    కేరళలో అధిక మొత్తంలో థోరియం నిక్షేపాలు ఉన్నందున, వాటిని ఉపయోగించి అణువిద్యుత్ ఉత్పత్తి చేసి, కేరళకు సరఫరా చేయాలని కేంద్ర మంత్రికి ఒక మెమో సమర్పించారన్నది వివరణ.

    అణు విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూర్చితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం సులభమవుతుందని మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు.

    వివరాలు 

    ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు

    ప్రస్తుతం, కేరళ విద్యుత్ లోటును ఎదుర్కొంటూ ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోంది.

    అందువల్ల, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు.

    ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నప్పటికీ, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

    ఇక, కేరళ ప్రభుత్వం అణువిద్యుత్ ప్లాంట్‌ను కోరలేదు, కానీ కేంద్రం థోరియం నిక్షేపాలను ఉపయోగించుకోవాలని సూచించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ వివరించింది.

    వివరాలు 

    కేరళలో 4,260 మెగావాట్ల సరఫరాను మాత్రమే నిల్వ చేయగల సదుపాయాలు

    ఈ సమావేశం గురించి మంత్రి కె. కృష్ణన్‌కుట్టి మాట్లాడుతూ, కేరళలో కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామన్నారు. 2030 నాటికి కేరళకు 10,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, దీనిని స్థానికంగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని చెప్పారు. కాబట్టి, ఈ మేరకు విద్యుత్ ఇతర రాష్ట్రాల నుంచి లేదా కేంద్రం ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేరళలో 4,260 మెగావాట్ల సరఫరాను మాత్రమే నిల్వ చేయగల సదుపాయాలు ఉన్నాయి, కానీ అదనపు విద్యుత్ కొనుగోలు కోసం కావలసిన మౌలిక సదుపాయాలు లేవని ఆయన తెలిపారు.

    వివరాలు 

    బార్హ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 177 మెగావాట్ల విద్యుత్ సరఫరా

    దీంతో, కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు.

    ఇంకా, బార్హ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 177 మెగావాట్ల విద్యుత్ సరఫరా కాంట్రాక్టు మార్చి వరకు మాత్రమే కొనసాగుతుందని, దానిని జూన్ వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

    ఈ సరఫరాను 177 మెగావాట్ల నుంచి 400 మెగావాట్లకు పెంచాలని కోరినప్పుడు, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కేరళ

    Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్‌లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ   భారతదేశం
    Veena George: 'సహాయక చర్య కోసం కువైట్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి భారతదేశం
    PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ నరేంద్ర మోదీ
    IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లోబయోటెక్నాలజీ విద్యార్థిని ఆత్మహత్య  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025