NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!
    తదుపరి వార్తా కథనం
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!

    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!

    వ్రాసిన వారు Stalin
    May 22, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సోమవారం కూడా హాజరు కాలేదు.

    కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో తన తల్లి గుండెపోటుకు చికిత్స తీసుకుంటున్నట్లు, తాను అక్కడే ఉండాల్సి ఉంటుందని, అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నానని, సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి సమాచారం ఇచ్చారు.

    ఈ క్రమంలో సీబీఐ అధికారులే ఏకంగా సోమవారం కర్నూలుకు వచ్చారు. ఎంపీ అవినాష్‌రెడ్డి లొంగిపోయేలా చేసేందుకు కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో సీబీఐ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్

    విశ్వభారతి ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

    సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రి వద్దకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

    వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరకున్నారు. దీంతో ఆస్పత్రి చుట్టూ పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

    అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవచ్చనే వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతానికి చేరుకున్న ఆయన మద్దతుదారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

    ముందస్తు చర్యలో భాగంగా సోమవారం ఆస్పత్రి పరిసరాల్లో దుకాణాలు తెరవడానికి పోలీసులు అనుమతించలేదు.

    ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి కడప ఎంపీ మద్దతుదారులు కొందరు మీడియా ప్రతినిధులపై దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేయడంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్నూలు
    వైఎస్సార్ కడప
    పులివెందుల
    కడప

    తాజా

    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ

    వైఎస్సార్ కడప

    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ తెలంగాణ
    వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత ఆంధ్రప్రదేశ్

    పులివెందుల

    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ కడప
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్

    కడప

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025