Page Loader
Haryana Assembly Elections 2024: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ .. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఎలా గెలిచిందంటే..?  
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ .. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఎలా గెలిచిందంటే..?

Haryana Assembly Elections 2024: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ .. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఎలా గెలిచిందంటే..?  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2024
10:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలో పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో భారతీయ జనతా పార్టీ (BJP) అప్రమత్తమైంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే, రాష్ట్రం కోల్పోయే అవకాశముందని బీజేపీ భావించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి కులాల సమీకరణాల వరకు పూర్తిగా కసరత్తు చేసింది. ముఖ్యంగా జాతీయ స్థాయి నేతల సమక్షంలో కాకుండా, రాష్ట్ర స్థాయిలోనే బీజేపీ ఈ పోరాటం చేయడం విశేషం. ముందస్తు సర్వేలు, ఎన్నికల తరువాత జరిగిన సర్వేలు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని హెచ్చరించినా, ప్రజలు బీజేపీకే మద్దతు ఇచ్చారు.

వివరాలు 

బీజేపీ సామాజిక ఇంజినీరింగ్‌ సత్తా 

బీజేపీ సామాజిక ఇంజినీరింగ్‌ కూడా విజయవంతమైందని ప్రచారం జరిగింది. జాట్‌ వర్గం కాంగ్రెస్‌ పక్షంలో ఏకమవుతుందని బీజేపీ గ్రహించింది. రెజ్లర్ల ఆందోళన కూడా జాట్‌ వర్గానికి మద్దతు కల్పించింది. ఈ నేపథ్యంలో, బలమైన ఓబీసీ వర్గాన్ని ఆకర్షించేందుకు నాయబ్‌ సింగ్‌ సైనీకి కీలక స్థానాలు అప్పగించింది. ఈ క్రమంలో, జాట్‌ వర్గం, ఇతర వర్గాల మధ్య పోరాటంలో బీజేపీ పైచేయి సాధించింది. దళితుల్లో జాటవ్‌ వర్గం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుండగా, మిగిలిన దళిత వర్గాలు బీజేపీ వైపుకి మళ్లాయి.

వివరాలు 

అగ్రకులాలపై దృష్టి 

బీజేపీ అగ్రకులాలు, పంజాబీలపై ఎక్కువగా ఆధారపడింది. లోక్‌సభ ఎన్నికల్లో నష్టాన్ని పరిగణలోకి తీసుకుని, వెంటనే రాష్ట్ర పగ్గాలను బ్రాహ్మణ వర్గానికి చెందిన మోహన్‌లాల్‌ బదోలికి అప్పగించింది. రాష్ట్రంలో ఈ వర్గానికి 7.5 శాతం ఓట్లు ఉన్నాయి. భాజపా 11 సీట్లను ఈ వర్గానికి కేటాయించింది. ఈ వర్గం ఎక్కువగా దేశ విభజన తర్వాత వలసవచ్చిన కుటుంబాలతో కూడి ఉండగా, వీరు ప్రధానంగా గ్రాండ్‌ ట్రంక్‌రోడ్‌ మార్గంలోని అర్బన్‌ నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వీరు బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చారు.

వివరాలు 

కాంగ్రెస్‌ వ్యూహం 

దీనికి బదులుగా, కాంగ్రెస్‌ జాట్‌-దళిత్‌ కూటమిని ఏర్పాటుచేసింది. బీజేపీ యాంటీ-జాట్‌ వ్యూహం వల్ల, కాంగ్రెస్‌ కాస్త తగ్గిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా జాట్‌ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే, అర్బన్‌ ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ భావించింది. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించడంలో ఆలస్యం చేసింది.

వివరాలు 

బీజేపీ బాలలు 

ఈ ఏడాది ప్రారంభంలో జేజేపీ అనూహ్యంగా మద్దతు ఉపసంహరించినప్పుడు, పార్టీ అధికారం నిలుపుకోవడం బీజేపీకి ఎన్నికల్లో ప్రయోజనం కలిగించింది. ఈసారి బీజేపీ ప్రచారంలో మహిళలను ప్రాధాన్యతగా తీసుకుంది, దీని ద్వారా ఆ మహిళా ఓటర్లలో కొంత సానుకూల స్పందన వచ్చింది. రైతుల ఆందోళనల వల్ల వచ్చిన ప్రతికూలతను తగ్గించుకోవడానికి, ఈ ఏడాది ఆగస్టులో 24 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం ద్వారా ప్రభుత్వం వ్యతిరేకతను కొంతమేర తగ్గించగలిగింది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఈసారి 10 ఇండస్ట్రియల్ కారిడార్లను రాష్ట్రానికి తీసుకొస్తామన్న బీజీపీ హామీ, ముఖ్యంగా యువతలో పనిచేసింది. వీటితో 50,000 ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానం యువత ఆకర్షణను పొందింది.

వివరాలు 

బీజేపీ బాలలు 

అగ్నివీర్‌ల సమస్య చాలా కాలం బీజేపీకి ఇబ్బందిగా మారినా, వారికి 10 శాతం రిజర్వేషన్లు, బ్యాంకు రుణాలు సరళతరం చేస్తామని హామీ ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించారు. నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించిన తర్వాత,బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం,యువతలో మంచి పేరు తెచ్చింది. టాప్స్(టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీం)వంటి కార్యక్రమాలు సానుకూల ప్రభావం చూపాయి. భవిష్యత్తులో 'ఒలింపిక్‌ నర్సరీ'లను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం కూడా యువతలో ఆకర్షణ కలిగించింది. అవినీతి సమస్యతో బాధపడుతున్న యువత,కాంగ్రెస్ నేతలు ప్రతీ 50 ఓట్లకు ఒక ఉద్యోగం ఇస్తామని చేసిన ప్రచారంతో విభ్రాంతికి గురైంది.సిఫార్సుల ఆధారంగా ఉద్యోగాలు అన్న ప్రచారం, ప్రతిభావంతులైన యువతను భయపెట్టింది,దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని ఓట్లలో ప్రతిఫలించింది.

వివరాలు 

బీజేపీ బాలలు 

మేవాఠ్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు కొన్ని వర్గాల ఓటర్లను బీజేపీ వైపుకు మారుస్తూ, భారీగా ఓటు వేయించడం బీజేపీకి లాభం చేకూర్చింది. ఈసారి మోదీ హరియాణాలో కేవలం నాలుగు ర్యాలీలకే పరిమితం కాగా, బీజేపీ హైకమాండ్‌ ఈ ఎన్నికలను పూర్తిగా రాష్ట్రస్థాయిలో పోరాడే విధంగా వ్యూహం రూపొందించింది.

వివరాలు 

ప్రభుత్వ వ్యతిరేకతకు కళ్లెం వేసేలా.. 

ప్రభుత్వ వ్యతిరేకతను నియంత్రించడానికి, బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను మార్చింది. అలాగే, దాదాపు సగం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది, తద్వారా స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతను తగ్గించింది. కొత్తగా 60 మందికి అవకాశం ఇచ్చింది, ఇందులో మంజూ హుడా, యోగేషన్‌ బైరాగి, కృష్ణకుమార్‌, ఆర్తిసింగ్‌ రావ్‌ వంటి ప్రముఖులు ఉన్నారు.

వివరాలు

అహిర్వాల్‌ బెల్ట్‌ అండగా..

బీజేపీకి ఈసారి కూడా అహిర్వాల్‌ బెల్ట్‌ బలమైన మద్దతుగా నిలిచింది. ఈ బెల్ట్‌లో గురుగ్రామ్‌, రేవరి, మహేంద్రఘడ్‌ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువగా అర్బన్‌ ఓటర్లు ఉన్నారు, వారు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడం ఈ పార్టీకి ప్రయోజనకరంగా మారింది. 2019లో హరియాణాలో ఇతర ప్రాంతాల్లో బీజేపీ సీట్లను కోల్పోయినా, ఈ ప్రాంతం మాత్రం గతానికి కంటే ఒకటి ఎక్కువ సీటుతో పార్టీకి మద్దతు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో గురుగ్రామ్‌, రోహ్‌తక్‌, భివానీ-మహేంద్రఘడ్‌ ప్రాంతాల్లోని 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 సీట్లను బీజేపీ గెలుచుకుంది.