
Pakistan: పాకిస్తాన్ 'మేడమ్ ఎన్' ట్రాప్లో భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఇన్ఫ్లూయెన్సర్లను గూఢచర్య కార్యకలాపాల్లోకి లాగేందుకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) ప్రణాళికాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈ లక్ష్యానికి భాగంగా, లాహోర్కి చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త నోషబ షెహజాద్ మసూద్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఆమె జయాన్ ట్రావెల్స్ అండ్ టూరిజం అనే సంస్థను లాహోర్లో నడుపుతోంది.
ఆమె భర్త పాక్ సివిల్ సర్వీసుల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. షెహజాద్కు ఐఎస్ఐతో బలమైన అనుబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
భారతదేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు పాకిస్తాన్ను సందర్శించేందుకు ఆమె సాయపడినట్లు సమాచారం.
ఐఎస్ఐ ఆమెకు 'మేడమ్ ఎన్' అనే కోడ్ నేమ్ను కేటాయించింది.
వివరాలు
సైనిక,నిఘా విభాగాలతో సంబంధాలు
పాకిస్థాన్ లో హిందూ,సిక్కు యాత్రికుల పర్యటనలు నిర్వహించే సంస్థలలో షెహజాద్ ఆధ్వర్యంలోని సంస్థే ప్రాధాన్యత పొందింది.
ఈ సంస్థ అక్కడి ప్రభుత్వ సంస్థ అయిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్తో కలిసి పనిచేస్తోంది.
దీని ద్వారా ఆమెకు ఉన్న సైనిక,నిఘా విభాగాలతో సంబంధాలు మరింత స్పష్టమవుతున్నాయి.
అంతేకాదు,భారత్లోని ఢిల్లీ తదితర నగరాల్లో ఈ సంస్థకు అనుబంధంగా పనిచేసే ట్రావెల్ ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో భారత్లో గూఢచర్య ఆరోపణలపై పలు అరెస్టులు జరగగా,విచారణలలో షెహజాద్ పాత్ర వెలుగులోకి వచ్చింది.
భారత్లో సుమారు 500 మంది సభ్యులతో ఓ స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటుచేయడంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి.
వివరాలు
సుమారు 3,000 మంది భారతీయులు ఆమె సంస్థ సేవలు పొందారు
ఈ కార్యక్రమానికి పాక్ ఐఎస్ఐ,ఆర్మీ నుంచి ఆమెకు స్పష్టమైన మార్గదర్శకాలు అందినట్లు పేర్కొన్నారు.
పాకిస్థాన్కు వెళ్లిన భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లను అక్కడి సైనిక అధికారులకు, ఐఎస్ఐ ప్రతినిధులకు పరిచయం చేయడంలో షెహజాద్ కీలక పాత్ర పోషిస్తుందట.
ఇప్పటివరకు సుమారు 3,000 మంది భారతీయులు ఆమె సంస్థ సేవలు పొందినట్లు సమాచారం.
వీరిలో సుమారు 1,500 మంది ఎన్నారైలు గత ఆరు నెలల కాలంలోనే పాకిస్థాన్ను సందర్శించారు.
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో వీసా విభాగంలోనూ షెహజాద్కి ప్రత్యేకమైన చొరవ ఉండేది.
అక్కడి ఫస్ట్ సెక్రటరీ (వీసా) సుహైల్ కమర్, కౌన్సిలర్ (ట్రేడ్) ఉమర్ ష్రేయర్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఆమె నుంచి వచ్చే ఒక్క ఫోన్కాల్ తో కోరుకున్న వారికి పాక్ వీసా లభించేది.
వివరాలు
జ్యోతి మల్హోత్రా వ్యవహారంతో డానిష్ బహిష్కరణ
వీసా ఆఫీసర్గా పనిచేస్తున్న ఎహసాన్ ఉర్ రెహ్మాన్ అలియాస్ డానిష్తోనూ ఆమెకు మంచి పరిచయం ఉంది.
'మేడమ్ ఎన్' సిఫారసు లేదా స్పాన్సర్షిప్ ఉంటే భారతీయులకు పాకిస్తాన్ విజిటర్ వీసా లభించేది.
ఇటీవల జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగులోకి రావడంతో, డానిష్ను భారత్ నుంచి బహిష్కరించారు.