English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 
    తదుపరి వార్తా కథనం
    డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 
    ప్రమాదరంగా ప్రవహిస్తున్న కడెం

    డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 27, 2023
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

    ఈ మేరకు లోతట్టు ప్రజలు, నదీ పరివాహిక ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న మత్స్యకారులు, ఇతర కుటుంబాలు చిగురుటాకులా వణికిపోతున్నారు.

    గోదావరిపై నిర్మించిన మరో ప్రాజెక్ట్ ఎల్లంపల్లిది దాదాపు ఇదే పరిస్థితి. ఉత్తర తెలంగాణలోని మిగతా ప్రాజెక్టుల్లోనూ ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.

    మరో 24 గంటల్లో అతిభారీ వర్షాల కారణంగా అనేక జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో కడెం పరిసరాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

    DETAILS

    భూపాలపల్లిలో రాత్రంతా ఎత్తైన భవనాలపైనే బిక్కుబిక్కుమన్న ప్రజలు

    తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి వర్షాలకు చాలా ప్రాంతాలను ఇప్పటికే నీరు చుట్టుముట్టింది. వాగులు వంకలు కుంటలు జలపాతాల ప్రవాహం ధాటికి రోడ్లు గల్లంతయ్యాయి.

    ఏజెన్సీ ప్రాంతాలు, మారుమాల గ్రామాలతో పాటు ఇతర పల్లెలకు బయటప్రపంచంతో దారులు తెగిపోయాయి.

    భూపాలపల్లి జిల్లాలో మొరంచవాగు ప్రవాహానికి మొరంచపల్లి మునిగింది. 6 ఫీట్ల ఎత్తులో వాగు ప్రవహిస్తున్న కారణంగా ఊర్లోకి నీరు చేరింది. ఎత్తైన భవనాలు ఎక్కి ప్రజలు తలదాచుకుంటున్నారు. రాత్రి అంతా బిల్డింగ్‌లపైనే ఉన్నామని జనం వాపోతున్నారు.

    మరోవైపు మెదక్, సిద్దిపేట జిల్లాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. సిద్దిపేటలో 14.7 సె.మీ వానలు పడగా, మెదక్‌లో 5.5 సెం.మీ వర్షం కురిసింది. ఈ మేరకు ప్రజలెవరూ ఇళ్లు విడిచి రావద్దని ఐఎండీ సూచించింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    భారీ వర్షాలు
    గోదావరి నదీ

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    తెలంగాణ

    KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు బోనాలు
    YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు నైరుతి రుతుపవనాలు
    మరోసారి వివాదాస్పదమైన తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు .. క్షమాపణ చెప్పాలని కడియం డిమాండ్ భారతదేశం
    హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్  మెట్రో స్టేషన్

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  ఉత్తరాఖండ్
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ

    గోదావరి నదీ

    గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు గంగపుత్రులు
    తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం భద్రాచలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025