NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు 
    తదుపరి వార్తా కథనం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు 
    వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు

    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 26, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.

    మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, దిల్లీ సహా తదితర రాష్ట్రాలను గత రెండు రోజులుగా వానలు ముంచెత్తుతున్నాయి.

    అయితే హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి.

    మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తుతోంది. వరదలో దాదాపుగా 200 మందికిపైగా స్థానికులు చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు.

    ప్రశార్ సరస్సు సమీపంలో సంభవించిన ఈ వర్షాల కారణంగా బగ్గీ వంతెన వద్ద పలువురు టూరిస్టులు సైతం వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు.

    DETAILS

    వరద నేపథ్యంలో  జాతీయ రహదారి మూసివేత :  డీఎస్పీ

    చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు వరదలో చిక్కుకుపోయినట్లు సమాచారం. మరోవైపు పరాశర్ ప్రాంతం నుంచి వచ్చే క్రమంలో వాహనాలు భారీ స్థాయిలో ప్రభావానికి గురైయ్యాయి.

    అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని డీఎస్పీ సూద్ వెల్లడించారు.

    మరోవైపు రాష్ట్రంలోని పండో - మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుంచి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

    ఈ నేపథ్యంలో జాతీయ రహదారిని సైతం మూసేశామని డీఎస్పీ తెలిపారు. సదరు రహదారిని తిరిగి ప్రారంభించేందుకు సమయం పడుతుందన్నారు.

    వరద ముంపు సమస్య బారిన పడిన ప్రజల్ని ఇతర మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతామని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    వరదలు

    తాజా

    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప
    Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు! అమెరికా
    Airtel Fraud Detection: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్‌ డిటెక్షన్‌' ఫీచర్‌ అందుబాటులోకి! ఎయిర్ టెల్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025