NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు
    హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు

    Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 05, 2025
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు.

    ఈ దాడుల్లో అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది.

    ఫారెక్స్ సేవలు, మనీ ట్రాన్స్ఫర్‌ల సాయంతో ఈ డబ్బు దేశం వెలుపలికి చేరుతోంది.

    ఈ ముగ్గురు నైజీరియన్లు హైదరాబాద్‌లోనే నివసిస్తూ, అక్కడి నుంచే డ్రగ్స్ రాకపోకల్ని సమన్వయం చేస్తూ ఉన్నట్టు నార్కోటిక్ బ్యూరో వెల్లడించింది.

    ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు.

    Details

    కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నిందితులు

    ఇదే నేపథ్యంలో, గత సంవత్సరం ఫిబ్రవరిలో నైజీరియాకు చెందిన మరో మాదకద్రవ్యాల విక్రేతను టీన్యాబ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

    నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రానికి చెందిన ఇవూలా ఉడోక స్టాన్లీ, ఉత్తర గోవాలోని కండోలింలో నివసిస్తూ మత్తు దందాలో లీనమై ఉన్నాడు.

    డ్రగ్స్‌ను కొరియర్‌ ద్వారా గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తూ, అవసరమైన వ్యక్తులకు వాటిని విక్రయిస్తున్నాడు.

    ఎస్‌ఆర్‌నగర్‌ మెట్రో స్టేషన్ వద్ద అతడిని పట్టుకున్న టీన్యాబ్ పోలీసులు, అతని ద్వారా భారీ మాదకద్రవ్యాల మాఫియాను బట్టబయలు చేశారు.

    ఇలా నైజీరియా దేశానికి చెందిన పలువురు మాదకద్రవ్యాల మాఫియాలో నిమగ్నమై ఉండటం గమనార్హం.

    తాజాగా అరెస్టైన ముగ్గురు నైజీరియన్ పౌరులతో మరోసారి డ్రగ్స్ మాఫియా నెట్వర్క్‌ను బయటపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    గోవా
    నైజీరియా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    హైదరాబాద్

    Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త  భారతదేశం
    Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ విమానాశ్రయం
    Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు సైబర్ నేరం
    GBS case: హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు భారతదేశం

    గోవా

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ విహారం
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ

    నైజీరియా

    నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి  తాజా వార్తలు
    నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి  ఆర్మీ
    Nigeria Attack News : నైజీరియాలో ముష్కరుల దాడి: 40 మంది హత్య  అంతర్జాతీయం
    Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025