NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ 
    "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ

    PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 19, 2024
    06:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో ఇటీవలే పూర్తయిన భారీ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉద్వేగానికి లోనయ్యారు.

    ''ఈ ఇళ్లను చూడగానే నా చిన్నపటి విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నతనంలో నేను కూడా ఇలాంటి ఇంట్లో ఉండే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా'' అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. కన్నీళ్లను దిగమింగుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

    మహారాష్ట్రలోని పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు.

    ఈ ప్రాజెక్ట్‌ను "పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీ" అని ఆయన పేర్కొన్నారు.

    Details 

    ఇళ్లల్లో "జనవరి 22న రామజ్యోతి"

    షోలాపూర్ ప్రాజెక్ట్ లబ్దిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు,విక్రేతలు,పవర్ లూమ్ కార్మికులు, ర్యాగ్ పికర్స్, బీడీ కార్మికులు, డ్రైవర్లు ఉన్నారు.

    ప్రజల కలలు సాకారమైతే సంతోషం కలుగుతుందని,వారి ఆశీస్సులే నాకు పెద్ద ఆస్తి అని అన్నారు.

    ఈ సందర్భంగా అయోధ్యలోని రామ మందిరంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిగే రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో "జనవరి 22న రామజ్యోతి"వెలిగించాలని ప్రజలను కోరారు.

    ''శ్రీరాముడి నిజాయతీని మా ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందన్నారు.మన కట్టుబాట్లను గౌరవించాలని రాముడు బోధించాడు.పేదల సంక్షేమం,వారి సాధికారత కోసం మేము పని చేస్తున్నాం "అని ప్రధాని అన్నారు.

    జనవరి 22న అయోధ్యను సందర్శించవద్దని,దానికి బదులుగా దీపావళి రోజున తమ ఇంట్లో దీపం వెలిగించి 'ప్రాణ ప్రతిష్ట' జరుపుకోవాలన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ 

    महाराष्ट्र में पीएम आवास योजना के अंतर्गत गरीबों के लिए बनी सबसे बड़ी सोसायटी के लोकार्पण की बात करते हुए अपने बचपन को याद कर भावुक हुए प्रधान सेवक श्री @narendramodi। pic.twitter.com/oo9Khn22Hy

    — BJP (@BJP4India) January 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  కేంద్ర కేబినెట్
    PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు:  మోదీ  ప్రధాన మంత్రి
    PM Modi: ఎంపీ నుంచి రికార్డు స్థాయిలో నగదు రికవరీ.. కాంగ్రెస్‌ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ  భారతదేశం
    Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా  జో బైడెన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025