NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు! 
    రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!

    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రేషన్ బియ్యాన్ని వద్దన్న వారికి.. వారి బియ్యానికి సరిపడా విలువ గల ఇతర నిత్యావసర వస్తువులు అందించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

    ఈ కొత్త విధానంపై పౌరసరఫరాల శాఖ అధ్యయనం చేస్తోంది.

    ఇటీవలే జూన్ 1న కోనసీమ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు, బియ్యం తీసుకోనివారికి నగదు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

    అంతకుముందు మంత్రిమండలి సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది.

    కేవలం నగదు ఇవ్వడం కాకుండా, కార్డుదారుల అభిప్రాయాలను సేకరించి, నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

    ప్రస్తుతం రేషన్ బియ్యం కిలోకు రూ.46 ఖర్చవుతోంది - ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలిపిన ఖర్చు.

    అయితే చాలా కుటుంబాలు ఈ బియ్యాన్ని రూ.10-11కి అమ్మేసేస్తున్నారు.

    వివరాలు 

    పేదరికానికి గుర్తుగా రేషన్ కార్డు - అందుకే డిమాండ్ 

    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య పథకాలు వంటి ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును ఎక్కువ మంది ఉంచుకుంటున్నారు.

    అందుకే, బియ్యం బదులుగా ఆ మొత్తానికి తగినంత ఇతర అవసరమైన వస్తువులు ఇవ్వాలన్న ఆలోచనలో అధికారులు కసరత్తు ప్రారంభించారు.

    ప్రభుత్వ పథకాల అర్హతకు గుర్తుగా రేషన్ కార్డే ప్రధానంగా పరిగణించబడుతోంది.

    అందుకే చాలామంది కుటుంబాలు నిజంగా బియ్యం అవసరం లేకున్నా కూడా రేషన్ కార్డును పొందుతున్నారు.

    రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండానే.. నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందించాలని గతంలో నిర్ణయించిన ప్రభుత్వం.. బియ్యం కార్డుగా పేరు మార్చినా, ఇంకా కొన్ని శాఖలు ఆరు అంచెల వడపోత (Six Step Validation) ప్రక్రియను అమలు చేస్తూ, బియ్యం కార్డును ప్రామాణికంగా చూస్తున్నాయి.

    వివరాలు 

    30 శాతం కుటుంబాలకు రేషన్‌ బియ్యమే ఆధారం 

    ఫలితంగా బియ్యం కార్డు మీద డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

    ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 కోట్ల రేషన్ కార్డులుండగా, వీటిలో సుమారు 30% కుటుంబాలు.. అంటే దాదాపు 44 లక్షల కుటుంబాలు.. ప్రభుత్వ బియ్యంపై ఆధారపడుతున్నాయి.

    మిగిలిన 70% మంది బియ్యం అవసరం లేకున్నా కార్డును ఉంచుకుంటూ నెలకి వచ్చే ఉచిత బియ్యాన్ని తీసుకుంటున్నారు.

    ఈ బియ్యం ఆలోచితంగా నల్లబజారులోకి తరలిస్తుండగా, మెజారిటీగా ఎండీయూ వాహనదారులు కిలో రూ.10 నుంచి రూ.11కు కొనుగోలు చేస్తూ అమ్మకానికి ఉంచుతున్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

    ఇది ఒక రకంగా మాఫియాగా మారింది.

    వివరాలు 

    ఒక్కో కుటుంబంపై రూ.920 

    ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్‌ చేయించి అందజేస్తుంది.

    ఇందులో ధాన్యం ధరతో పాటు రవాణా, కమీషన్, ఇతర వ్యయాలు కలిపి కిలో బియ్యానికి రూ.46 వరకు ఖర్చవుతుంది.

    రాష్ట్రంలోని 1.46 కోట్ల రేషన్ కార్డుల్లో 90 లక్షల కుటుంబాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోంది.

    మిగిలిన 56 లక్షల కార్డులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.6,193 కోట్లు భరిస్తోంది.

    నలుగురు సభ్యుల కుటుంబానికి నెలకు 20 కిలోల బియ్యం ఇచ్చేందుకు సుమారు రూ.920 ఖర్చవుతోంది.

    అదే మొత్తానికి సమానంగా కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసరాలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

    వివరాలు 

    ధాన్య సేకరణపై ప్రభావం తప్పదు 

    ప్రతి సంవత్సరం ప్రభుత్వం మద్దతు ధరపై 42-50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తుంది.

    వీటిలో 25.46 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇక నగదు బదిలీ విధానం అమలు చేస్తే, మిగిలిన బియ్యాన్ని ఎలా వినియోగించాలి అన్న ప్రశ్న ఎదురవుతుంది.

    విదేశాల్లో డిమాండ్ ఉన్నా, పౌర సరఫరాల శాఖ ద్వారా ఎగుమతి చేసే వ్యవస్థ ఇప్పటికీ లేదు.

    తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే విదేశీ ఒప్పందాల ద్వారా ధాన్యం ఎగుమతులకు మార్గం సుళువుగా చేసుకుంది. ఏపీ కూడా ఆ దిశగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతోంది.

    వివరాలు 

    మాఫియాకు చెక్ పెట్టే నగదు బదిలీ 

    రేషన్ బియ్యం పేదల కోసం ఇచ్చినా, వాస్తవంగా 70% వరకు నల్లబజారుకే వెళ్లిపోతోంది.

    ఇది వేల కోట్ల విలువైన వ్యవహారంగా మాఫియాకు ఆశ్రయంగా మారింది. ధాన్యం కొనుగోలు దశ నుంచే అవినీతి వ్యాపించింది.

    రైతుల నుంచి ధాన్యం కొనాలంటే మిగులు రేట్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

    మిల్లింగ్‌ దశ, రవాణా (స్టేజ్‌-1,2), రేషన్ షాపులు, ఎండీయూ వాహనాలు - ఇలా ప్రతి దశలోనూ అవినీతి క్రమబద్ధంగా జరుగుతోంది.

    అందుకే నగదు బదిలీ విధానం అమలైతే, ఈ మాఫియాకు భారీ దెబ్బ తగలవచ్చని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్
    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్

    ఆంధ్రప్రదేశ్

    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు! శ్రీశైలం
    New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు! భారతదేశం
    Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ తెలంగాణ
    AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025