Page Loader
Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్
ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 21, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు సంస్థకు ఇచ్చిన సమాధానంలో, కేజ్రీవాల్ తన జీవితాన్ని పారదర్శకత,నిజాయితీతో గడిపారని, దాచడానికి ఏమీ లేదని అన్నారు. కేజ్రీవాల్ ని గురువారం ఈడీ విచారణకు పిలిచింది. అయితే ఆయన 10 రోజుల పాటు విపస్సనా ధ్యాన సెషన్‌కు వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మొదటగా ఈడీ కేజ్రీవాల్ ను నవంబర్ 2న తన ముందు హాజరుకావాలని కోరింది. కానీ ఆయన విచారణకు హాజరుకాకుండా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

Details 

పబ్లిక్ డొమైన్‌లో అరవింద్ కేజ్రీవాల్ విపాసన సెషన్ 

ఆమ్ ఆద్మీ పార్టీ లాయర్లు నోటీసును అధ్యయనం చేస్తున్నారని,తదనంతరం "చట్టపరంగా సరైన" చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ విపాసన సెషన్ ముందే షెడ్యూల్ చేయబడిందని దీనికి సంబంధించి సమాచారం పబ్లిక్ డొమైన్‌లో ఉందని వారు చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిసెంబర్ 19న విపాసన సెషన్ కు వెళతారని అందరికీ తెలుసు. ఆయన క్రమం తప్పకుండా ఈ మెడిటేషన్ కోర్సుకు వెళుతుంటారు. ఇది ముందుగా నిర్ణయించిన ,ప్రకటించిన ప్రణాళికని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.