Page Loader
AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2024
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని రెండు సంవత్సరాల పాటు అమలు చేయనుంది. ఈ విధానం 2023 అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. ఈ విధానంలో ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ప్రతి దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలి. లైసెన్సులు కేటాయించడానికి లాటరీ విధానాన్ని అనుసరించనున్నారు. లైసెన్సు రుసుము ప్రాంత జనాభా ఆధారంగా నాలుగు శ్రేణీలుగా విభజించారు.

Details

పది వేల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు

పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు రుసుము విధించారు. రెండో ఏడాది ఈ రుసుముపై 10% వృద్ధి కల్పించనున్నారు. లైసెన్సుదారులకు 20% మార్జిన్ కూడా ఉంటుందని వెల్లడించారు. ప్రీమియం మద్యం స్టోర్లను విజయవాడ, విశాఖపట్నం, ఇతర ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు, వీటి కోసం రూ.1 కోటి లైసెన్సు రుసుము చెల్లించాలి. మద్యం ధరలను సవరించి, క్వార్టర్ మద్యం రూ.99కే అందుబాటులో ఉంచారు.

Details

గీత కార్మికులకు 340 మద్యం దుకాణాలు

ప్రభుత్వానికి ల్యాండెడ్‌ కాస్ట్‌పై 2% మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం విధించారు. ఈ సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంజాయి, డ్రగ్స్ నియంత్రణ చర్యలకు కేటాయిస్తారు. మద్యం రిటైల్‌ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వ చట్టంలో సవరణలు చేసి కొత్త ఆర్డినెన్స్ విడుదల చేశారు. ప్రత్యేకంగా గీత కార్మికులకు 340 మద్యం దుకాణాలు కేటాయించారు. కొన్ని కులాలకు రిజర్వేషన్లు కూడా కల్పించారు.