తదుపరి వార్తా కథనం

PM Modi: 100 రోజుల్లో, దేశ ప్రగతి కోసం ప్రతి రంగాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించాం: ప్రధాని
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 16, 2024
01:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలు తమకు మూడోసారి అధికారాన్ని అందించారని ఎంతో నమ్మకంతో చెప్పారు.
భారత్ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో నిలబెట్టేందుకు 140 కోట్ల మంది భారతీయులు కలిసి పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్లోని గాంధీనగర్లో గ్లోబల్ రెన్యువబుల్ ఇన్వెస్టర్స్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
వివరాలు
మా ట్రైలర్లో అదంతా కనిపిస్తుంది
"దేశం మిషన్-విజన్లో ఈ సదస్సు ఒక భాగం. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ఇది ఒక అడుగు. మా ప్రభుత్వం ఏర్పాటు అయిన వంద రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు మా ప్రణాళికకు సంబంధించిన ట్రైలర్ను చూపిస్తున్నాయి. దేశం ప్రగతికి సంబంధించి అన్ని రంగాలలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాం" అని మోదీ చెప్పారు.