NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 
    తదుపరి వార్తా కథనం
    కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 
    కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం

    కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.

    అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

    ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వెళ్లారు. ఈ క్రమంలో కల్నల్, మేజర్, డిప్యూటీ ఎస్పీ ముందుండి దళాలను నడిపిస్తున్నారు.

    ఒక రహస్య స్థావరంలో ఉగ్రవాదులు కనిపించగా, అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో ముందు వరుసలో నిలబడ్డ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ ఎస్పీ హిమన్యున్ ముజామిల్ భట్‌పై కాల్పులు జరిపారు.

    జమ్ము

    'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు చెందిన ఉగ్రవాదులు

    ఉగ్రవాదుల కల్నల్ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు అధికారులకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్‌లో శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

    ఈ ఉగ్రవాదులు లష్కరే సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు చెందినవారుగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

    కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ (19 ఆర్ఆర్) యూనిట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన ప్రతిష్టాత్మక సేన మెడల్ గ్రహీత కూడా కావడం గమనార్హం.

    హిమాయున్ ముజామిల్ భట్ తండ్రి గులాం హసన్ భట్ జమ్ముకశ్మీర్ ఐజీ హోదాలో రిటైర్ అయ్యారు.

    అయన తన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ముగ్గురు యువ ధైర్యవంతులైన అధికారులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నివాళుల్పరిస్తున్న దృశ్యం

    On behalf of the J&K Police Pariwar DGP J&K Sh Dilbag Singh has condoled the martyrdom of the braveheart officers of J&K Police and Army in an encounter at Gadool,Kokernag,Anantnag.
    The DGP has said in his message that he is deeply saddened by the terrible loss of three young… pic.twitter.com/pMJSwYE8wX

    — J&K Police (@JmuKmrPolice) September 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఎన్‌కౌంటర్
    ఆర్మీ
    పోలీస్

    తాజా

    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి
    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా

    జమ్ముకశ్మీర్

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు శ్రీనగర్
    జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు ఉగ్రవాదులు
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు తాజా వార్తలు

    ఎన్‌కౌంటర్

    Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం  జమ్ముకశ్మీర్

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం

    పోలీస్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  మధ్యప్రదేశ్
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! దిల్లీ
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025