NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం 
    తదుపరి వార్తా కథనం
    Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం 
    81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం

    Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం 

    వ్రాసిన వారు Stalin
    Oct 31, 2023
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.

    ఐసీఎంఆర్ వద్ద కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్న 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా వివరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటానే లీకైంది.

    లీకైన డేటాలో 81.5కోట్ల మంది ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారంతో పాటు వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు ఉన్నాయి.

    అక్టోబర్ 9న 'pwn0001' పేరుతో ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ వివరాలను థ్రెడ్ పోస్ట్ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు రిసెక్యూరిటీ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో రాసింది.

    డేటా

    ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ CoWinలో డేటా లీక్

    మీడియా నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రస్తుతం హ్యాకర్ "pwn0001"పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

    డేటా చౌర్యం గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఐసీఎంఆర్‌కు కూడా తెలియజేసింది.

    డార్క్‌వెబ్‌లో డేటా ఉన్న నమూనాను.. సర్వర్‌లో ఉన్న డేటా ఒకటే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ఏజెన్సీలు, ఐసీఎంఆర్‌కు ఈ విషయాన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివరించింది.

    డేటా ఉల్లంఘన జరగడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు జూన్‌లో CoWin వెబ్‌సైట్ నుంచి వీవీఐపీలతో సహా టీకాలు వేసిన పౌరుల వ్యక్తిగత డేటా టెలిగ్రామ్ మెసెంజర్ ఛానెల్ ద్వారా లీక్ కాగా.. ప్రభుత్వం విచారణ చేపట్టింది.

    డేటా

    గతేడాది ఐసీఎంఆర్ సర్వర్‌పై 6,000సార్లు సైబర్ దాడులు

    ఫిబ్రవరి నుంచి ఐసీఎంఆర్ అనేక సైబర్ దాడులను ఎదుర్కొంటోందని 'న్యూస్ 18' వెబ్ సైట్ రాసుకొచ్చింది. ఈ విషయం కేంద్ర కేంద్ర ఏజెన్సీలు, ఐసీఎంఆర్‌కు కూడా తెలుసు.

    గత ఏడాది ఐసీఎంఆర్‌ సర్వర్‌ను హ్యాక్ చేయడానికి 6,000 కంటే ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి.

    డేటా లీక్‌ను నిరోధించేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని కూడా ఐసీఎంఆర్‌‌ను కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం చేశాయి. కానీ దిశగా ఐసీఎంఆర్‌ చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య ఆధార్, వ్యక్తుల మొబైల్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న క్రమంలో ఇలాంటి ఘటనలు పెనుసవాళ్లుగా పరణమిస్తున్నాయి.

    డేటా

    డేటా లీక్‌లో విదేశీయుల హస్తం

    డేటా లీక్‌లో విదేశీ నేరస్థులు ఉన్నందున, దానిని ఒక ప్రధాన ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయడం చాలా ముఖ్యం. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నష్టాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టినట్లు తెలుస్తోంది.

    కోవిడ్ -19 పరీక్ష కోసం నమోదు చేసిన డేటాను ఎన్ఐసీ, ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే.. ఈ డేటా ఎక్కడ లీక్ అయ్యిందో ఇంకా ధృవీకరించబడలేదు.

    అయితే డేటా లీకేజీపై ఐసీఎంఆర్ ఇంకా స్పందింలేదు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ ఫిర్యాదు చేసిన తర్వాత సీబీఐ దర్యాప్తు చేపడుతుందని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే.. సీబీఐ తన దర్యాప్తును మొదలు పెట్టినట్లు మరికొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏది నిజమో తేలాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం
    కోవిడ్

    తాజా

    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి

    కోవిడ్

    దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్ కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!  కరోనా కొత్త కేసులు
    తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు  తెలంగాణ
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025