Rahul Gandhi : ఓబీసీ కులగణనపై రాహుల్ X Ray వ్యాఖ్యలు.. అఖిలేష్ ఏమన్నారో తెలుసా
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల్లో సమీపస్తున్న వేళ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడుతోంది. అయితే ఈ కూటమిలో భాగంగా ఉన్న ఎస్పీ అధినేత వ్యాఖ్యలు అలయెన్స్ లో కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఓబీసీల కులగణన ఎందుకు నిర్వహించలేదని అఖిలేష్ యాదవ్ నిలదీస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని సాత్నాలో ఓబీసీ కుల గణనపై రాహుల్ గాంధీ చేసిన "ఎక్స్-రే" వ్యాఖ్యలతో అఖిలేష్ విభేదించారు. ఎంఆర్ఐ (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), సిటీ(కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్ వంటి అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు ఎక్స్రే చేయాలనడం దేనికి అని అన్నారు.