NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం 
    'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2025
    01:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్ని రంగాల్లో బలంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం ప్రశంసించారు.

    అదే సమయంలో విపక్షాల 'ఇండియా కూటమి' భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారు.

    కూటమిలో నెలకొన్న అస్పష్టత వాస్తవమేనని ఆయన అంగీకరించారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

    వివరాలు 

    బీజేపీకి ప్రతి వ్యవస్థపై పట్టు ఉంది: చిదంబరం

    ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం మాట్లాడుతూ.. ''ఇండియా కూటమి స్థిరంగా కొనసాగితే ఆనందంగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అది బలహీనంగా కనిపిస్తోంది. అయితే తిరిగి బలపడేందుకు ఇప్పటికీ సమయం ఉంది. ఇక బీజేపీ విషయానికొస్తే, చాలా శక్తివంతంగా, వ్యవస్థీకృతంగా పనిచేస్తోంది. నా అనుభవంతో చెప్పగలను,అన్ని రంగాల్లోను అంతగా పటిష్టంగా పనిచేసే మరో పార్టీ ప్రస్తుతం లేదు.బీజేపీకి ప్రతి వ్యవస్థపై పట్టు ఉంది.వాటిని తన నియంత్రణలోకి తీసుకునే సామర్థ్యం ఆ పార్టీకి ఉంది. అలాంటి పరిస్థితుల్లో విపక్ష కూటమి బలపడాలంటే, అన్ని విభాగాల్లోనూ తనను తాను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 2029 సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి'' అని అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    చిదంబరం వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ 

    చిదంబరం చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది.

    వరుస పరాజయాలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలిచివేశాయని ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ విమర్శించారు.

    మరో బీజేపీ నేత ప్రదీప్ బండారీ మాట్లాడుతూ.. ''చిదంబరం స్వయంగా అంగీకరించినట్టుగా, విపక్ష కూటమిలో స్పష్టత లేదు. బీజేపీ మాత్రం బలమైన పార్టీగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న విషయం రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్న వారికి కూడా తెలుసు'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా కూటమి

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    ఇండియా కూటమి

    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో ముంబై
    ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం ముంబై
    "సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025