NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉంది: ఇస్రో చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉంది: ఇస్రో చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    అంగారక,శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా మనకుంది

    అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉంది: ఇస్రో చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 27, 2023
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు సైన్స్ తో పాటు ఆధ్యాత్మిక రంగంపైనా ఆసక్తి ఉందని వెల్లడించారు. ఈ మేరకు తరచుగా ఆలయాలను సందర్శిస్తానన్నారు.

    చంద్రయాన్‌-3 విజయం తర్వాత ఇస్రో తదుపరి ప్రణాళికల గురించి ఆయన మాట్లాడారు. చంద్రుడితో పాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉందన్నారు.

    పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనా రంగం సహా భారతదేశం అభివృద్ధి చెందడం తమ లక్ష్యమన్నారు.

    దేశ అంతరిక్ష రంగ అభివృద్ధిపై ప్రధాని మోదీకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. తమకు నిర్దేశించిన భవిష్యత్ లక్ష్యాలను అందుకునేందుకు రెఢీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

    DETAILS

    శివశక్తి పేరు పెట్టడాన్ని సమర్థించిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

    కేరళలోని తిరువనంతపురంలోని భద్రకాళి ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ సందర్శించారు. గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకున్న నిజమైన అర్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు.

    విక్రమ్ ల్యాండర్‌ దిగిన చోటుకు శివశక్తిగా పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. తిరంగా (చంద్రయాన్‌ 2 క్రాష్‌ అయిన ప్రదేశం పేరు)తో పాటు శివశక్తి భారతీయతకు చిహ్నమని సోమనాథ్ చెప్పారు.

    చంద్రయాన్‌-3 ల్యాండర్‌, రోవర్‌ పనితీరు మెరుగ్గానే ఉందని, ఎప్పటికప్పుడు సమాచారం వస్తోందన్నారు. 14 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌ పనితీరును క్షుణ్ణంగా పరీక్షించి మెరుగైన ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశారు.

    గ్రీస్‌ పర్యటన తర్వాత శనివారం ఇస్ట్రాక్‌ కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, జై జవాన్‌, జై కిసాన్‌తో పాటు జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్‌ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    చంద్రయాన్-3

    తాజా

    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఇస్రో

    మరోసారి కక్ష్యను తగ్గించిన ఇస్రో: చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3  చంద్రయాన్-3
    చంద్రయాన్-3: 100కిలోమీటర్లు దాటి దగ్గరవుతున్నప్పుడే ఇబ్బంది అంటున్న ఇస్రో ఛైర్మన్  చంద్రయాన్-3
    అన్నీ ఫెయిలైనా చంద్రుడిపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో ఛైర్మన్  చంద్రయాన్-3
    చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3: కక్ష్య కుదింపు చర్యలో విజయం  చంద్రయాన్-3

    చంద్రయాన్-3

    Chandrayaan 3 : మరో సూపర్ న్యూస్‌ను అందించిన ఇస్రో.. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్ ఇస్రో
    Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది..17 నిమిషాలు ఆలస్యంగా అడుగుపెట్టనున్న ల్యాండర్  ఇస్రో
    చంద్రయాన్-3: సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకున్న ల్యాండర్; ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో  ఇస్రో
    Chandrayaan-3: చంద్రయాన్-2-ఆర్బిటర్-చంద్రయాన్-3-ల్యాండర్ ను అనుసంధానించిన ఇస్రో  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025