NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్
    భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్

    India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 27, 2025
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-చైనా సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా ఉద్రిక్తతలను కొనసాగిస్తోంది. భవిష్యత్తులోనూ కొన్ని సమస్యలు కొనసాగుతాయని, అయితే వాటిని పరిష్కరించే మార్గాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.

    2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ గురించి మాట్లాడుతూ, అది సరైన పరిష్కార మార్గం కాదని స్పష్టం చేశారు.

    2020లో తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

    వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నమే ఈ ఉద్రిక్తతకు కారణమైంది.

    దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈ ఘర్షణలో ప్రాణనష్టం సంభవించింది. భారత సైన్యంలో 20 మంది వీరమరణం పొందగా, దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక భావోద్వేగాలు మరింత మిన్నంటాయి.

    Details

     రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొంత పురోగతి 

    ఆసియా సొసైటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, ఈ తరహా ఘటనలు సమస్యల పరిష్కారానికి సరైన మార్గం కాదని తేల్చిచెప్పారు.

    2024 అక్టోబర్ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. 2020లో జరిగిన ఘటనల ప్రభావం నుంచి దశలవారీగా బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జైశంకర్ వివరించారు.

    ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలు మిలిటరీ, దౌత్య చర్చలు జరిగాయి. గత అక్టోబర్‌లో భారత్-చైనా మధ్య కీలక గస్తీ ఒప్పందం కుదిరింది.

    2020 నాటి యథాస్థితి LAC వెంబడి కొనసాగనుంది. ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన ప్రాంతాలకు స్వేచ్ఛగా వెళ్లేందుకు అనుమతించారు.

    Details

    డబ్ల్యూఎంసీసీ సమావేశంలో పలు ప్రతిపాదనలు

    తాజాగా భారత్-చైనా బీజింగ్‌లో జరిగిన చర్చల్లో సరిహద్దుల్లో సహకారం, సమర్థ నిర్వహణ, నదుల సమాచారం పంచుకోవడం, కైలాస్-మానససరోవర్ యాత్రకు అనుమతులు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

    సరిహద్దు సమస్యల పరిష్కారానికి డబ్ల్యూఎంసీసీ సమావేశంలో పలు ప్రతిపాదనలు పరిశీలించారు.

    డిసెంబర్‌లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేందుకు పలు చర్యలు తీసుకున్నారు.

    Details

    భారత్ భూభాగాలను ఆక్రమించడాన్ని తాము అంగీకరించం

    అయితే చర్చలు జరుగుతూనే చైనా తన కుయుక్తులకు పాల్పడుతోంది. లద్దాఖ్ ప్రాంతంలోని కొన్ని భూభాగాల్లో కౌంటీలను ఏర్పాటు చేస్తోంది.

    'చైనా ఏర్పాటుచేస్తున్న రెండు కొత్త కౌంటీలలో కొన్ని ప్రాంతాలు లద్దాఖ్ పరిధిలోకి వస్తాయి. భారత భూభాగాలను ఆక్రమించడాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోం.

    భారత సార్వభౌమాధికారంపై మా వైఖరిని ఈ చర్యలు ఏమాత్రం ప్రభావితం చేయవు. చైనా చేపడుతున్న బలవంతపు ఆక్రమణలకు చట్టబద్ధతను కల్పించలేవని కేంద్రం స్పష్టం చేసింది.

    సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    చైనా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఇండియా

    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. మంచు చరియల కింద చిక్కుకున్న 8 మంది ఉత్తరాఖండ్
    Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్‌ షాక్‌.. పార్టీ నుంచి సస్పెన్షన్ కాంగ్రెస్
    PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ నరేంద్ర మోదీ
    USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం! అమెరికా

    చైనా

    China: తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం అమెరికా
    Hydropower Dam: చైనాలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు.. భారత్ సరిహద్దు వద్ద 'వాటర్ బాంబ్' హెచ్చరిక ఇండియా
    PM Modi: 2025లో మోడీ చైనా పర్యటన.. ఇండియాకు పుతిన్, ట్రంప్ నరేంద్ర మోదీ
    China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025