NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
    ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

    Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 27, 2025
    10:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

    ఎండ వేడితోపాటు వడగాల్పులు కూడా తోడవ్వడంతో మధ్యాహ్నం బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

    ముఖ్యంగా ఏపీలో తీవ్ర ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది

    Details

    ఏపీలో తీవ్ర వడగాల్పులపై రెడ్ అలర్ట్ 

    ఏపీలో గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 199 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని APSDMA హెచ్చరించింది.

    శుక్రవారం 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 186 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

    శ్రీకాకుళం (13 మండలాలు), విజయనగరం (14), పార్వతీపురం మన్యం (11), అనకాపల్లి (2), కాకినాడ (4), తూర్పు గోదావరి (2), ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

    Details

    గడచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 

    బుధవారం సిద్ధవటంలో 40.8 డిగ్రీలు, కమ్మరచేడులో 40.7 డిగ్రీలు, నిండ్రలో 40.1 డిగ్రీలు, మంగనెల్లూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    ఎండ వేడి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.

    ఓఆర్ఎస్, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలను తీసుకోవాలి.

    వదులుగా, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి.

    నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

    Details

     ఎండ వేళల్లో ఇవి చేయొద్దు 

    మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు బయటకు వెళ్లడం వద్దు.

    అధిక శారీరక శ్రమ అవసరమైన పనులను దూరంగా ఉంచాలి.

    ఆల్కహాల్, టీ, కాఫీ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

    ఉప్పు, కారం, నూనె అధికంగా ఉన్న ఆహారాన్ని మించుకు తినకూడదు. నిల్వ ఉన్న ఆహారం సేవించకూడదు.

    Details

     దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత 

    మార్చి ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి.

    ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

    బుధవారం తెలంగాణలోని నిజామాబాద్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో నంద్యాల జిల్లాలో 40 డిగ్రీలు నమోదయ్యాయి.

    రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Neeraj Chopra: దోహా డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్‌ చోప్రా నీరజ్ చోప్రా
    Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా  కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు  బీసీసీఐ
    Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి  తెలంగాణ
    Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేశ్‌ చర్యలు.. 1-9 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్‌ విధానం భారతదేశం
    Somu Veerraju: నేడు ఎమ్మెల్సీ నామినేషన్.. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం బీజేపీ
    Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్.. హైదరాబాద్-తిరుపతి రైలు ప్రయాణం ఇక వేగవంతం తిరుపతి
    Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్ తిరస్కరణ.. మిగతా కేసుల్లో నోటీసులిచ్చేలా ఆదేశం!  వైసీపీ

    తెలంగాణ

    TG Drug Control : డ్రగ్స్ మాఫియాకు చెక్.. తెలంగాణలో కఠిన చట్టాల అమలు రేవంత్ రెడ్డి
    Telangana Govt: కుంభమేళా స్థాయిలో పుష్కర ఏర్పాట్లు.. శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు! ఇండియా
    Revanth Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు.. సీఎం రేవంత్ ప్రతిపాదన రేవంత్ రెడ్డి
    Kalyana Lakshmi Scheme: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025