NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం
    తదుపరి వార్తా కథనం
    ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం
    ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సఫలం

    ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 16, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియా - చైనా సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా 19వ సారి రౌండ్ టేబుల్ చర్చలు జరిగాయి.

    ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సుధీర్ఘ చర్చలో సానూకూల వాతావరణం ఏర్పడింది.

    ఈ మేరకు రెండు దేశాలు సహృద్భావంతో ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

    మరోవైపు తూర్పు లద్దాక్ సరిహద్దు ప్రాంతంలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత్ - చైనాల సైనిక ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకున్నారు.

    భవిష్యత్ లో మరిన్ని చర్చలు జరిపేందుకు సిద్ధమేనని పేర్కొన్నాయి. భారత్ - చైనాల కార్ప్స్‌-కమాండర్‌ స్థాయి చర్చలు చుసుల్‌-మాల్దో సరిహద్దులో ఆగస్ట్ 13, 14న జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

    details

    క్షేత్రస్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాల గ్రీన్ సిగ్నల్

    వాస్తవాధీన రేఖ వద్ద అనేక అంశాలపై ఇరు దేశాలు నిర్మాణాత్మకంగా చర్చించాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక ముందూ చర్చలు కొనసాగించే ఉద్దేశంలో ఇరు దేశాలున్నాయని వివరించింది.

    సరిహద్దులో నెలకొన్న సమస్యలను క్రమేపీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. సైనిక, దౌత్యపరంగా చర్చలు, సంప్రదింపులు కొనసాగించేందుకు రెండు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.సరిహద్దు ప్రాంతాల్లోని క్షేత్రస్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

    గల్వాన్ ఘటన తర్వాత లద్దాక్ ప్రాంతంలో ఇప్పటికే 68 వేల మంది సైనికులను మోహరించినట్లు ఇటీవలే భారత రక్షణశాఖ వివరించింది.

    90కిపైగా వార్ హెడ్స్, రాడార్ లు, అధునాతన ఆయుధాలను తరలించినట్లు వెల్లడించింది.

    ఇండో చైనా సరిహద్దులో సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025