NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-China: భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్
    తదుపరి వార్తా కథనం
    India-China: భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్
    భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్

    India-China: భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 04, 2024
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, చైనాల మధ్య వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో కొంత మేర పురోగతి సాధించబడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ తెలిపారు.

    ఈ పరిణామం ఒక స్వాగతార్హమైన అంశమని ఆయన పేర్కొన్నారు.

    ఆదివారం, ఆస్ట్రేలియాలో జరిగే ప్రవాస భారతీయుల సదస్సులో మాట్లాడుతూ, "మా (భారత్-చైనా) మధ్య సంబంధాలు వివిధ కారణాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయని మీ అందరికి తెలిసిందే" అని జైశంకర్ వెల్లడించారు.

    2020కు ముందు, చైనా భారీగా తన బలగాలను ఎల్ఏసీ వెంబడి మోహరించగా, దానికి సమాధానంగా భారత్ కూడా భద్రతా బలగాలను ఉంచిందని ఆయన తెలిపారు.

    వివరాలు 

    పశ్చిమాసియాలో సంక్షోభంపై స్పందించిన జై శంకర్  

    అయితే, ఈ సవాళ్ల కారణంగా ఇతర అంశాలలో కూడా భారత్-చైనా సంబంధాలు ప్రభావితం అయ్యాయని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు.

    బలగాల ఉపసంహరణ అనంతరం ఈ సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

    పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం గురించి కూడా జైశంకర్ స్పందించారు.

    ప్రస్తుతం యుద్ధం విస్తరించకుండా ఉండేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్-రష్యా మధ్య నేరుగా సంబంధాలు లేకపోవడం వల్ల ఈ సంక్షోభం కొనసాగుతుందని వివరించారు.

    ఈ సమస్యలను తగ్గించేందుకు పలువురు దేశాలు చొరవ చూపుతున్నాయని ఆయన చెప్పారు.

    ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని భాకత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    సుబ్రమణ్యం జైశంకర్

    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ పాకిస్థాన్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025