NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tejas Mk1a: జీఈ ఏరోస్పేస్ పై  భారత్ భారీ జరిమానా: తేజస్ MK1A ఇంజిన్ల డెలివరీ ఆలస్యంపై కేంద్రం చర్య 
    తదుపరి వార్తా కథనం
    Tejas Mk1a: జీఈ ఏరోస్పేస్ పై  భారత్ భారీ జరిమానా: తేజస్ MK1A ఇంజిన్ల డెలివరీ ఆలస్యంపై కేంద్రం చర్య 
    జీఈ ఏరోస్పేస్ పై భారత్ భారీ జరిమానా

    Tejas Mk1a: జీఈ ఏరోస్పేస్ పై  భారత్ భారీ జరిమానా: తేజస్ MK1A ఇంజిన్ల డెలివరీ ఆలస్యంపై కేంద్రం చర్య 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 29, 2024
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం, స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించడంలో విఫలమైన అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్(GE)ఏరోస్పేస్ కు భారీ జరిమానా విధించినట్లు సమాచారం.

    F404-IN20 ఇంజిన్‌ల సరఫరాలో జీఈకి ఏర్పడిన ఆలస్యాలు, 2023లోనే డెలివరీ ప్రారంభించాల్సిన విషయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

    రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనల సందర్భంగా ఈ ఆలస్యంపై చర్చలు జరిపినట్లు సమాచారం.

    భారత వైమానిక దళం (IAF), తేజస్ విమానాల తయారీ వేగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మొదటి విమానాన్ని మార్చి 31, 2024 నాటికి అందించాలని కోరింది.

    అయితే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నవంబర్ 2024కి డెలివరీని అంచనా వేస్తోంది.

    వివరాలు 

     మార్చి లేదా ఏప్రిల్ 2025 నాటికి ఇంజిన్ల డెలివరీ 

    F404 ఇంజిన్‌ల డెలివరీ 2023లో ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, జీఈ ఏరోస్పేస్‌కు ఒక సంవత్సరం ఆలస్యం జరిగింది.

    సప్లై చైన్ సమస్యల వల్ల ఈ ఆలస్యాలు ఏర్పడినట్లు కంపెనీ నివేదించింది. ప్రస్తుతం, మార్చి లేదా ఏప్రిల్ 2025 నాటికి ఇంజిన్ల డెలివరీ ప్రారంభించనున్నట్లు జీఈ హామీ ఇచ్చింది.

    ఈ ఇంజిన్ల డెలివరీలో జాప్యం, IAF పోరాట సంసిద్ధతపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

    HAL సంస్థ, తేజస్ విమానాల తయారీ వేగాన్ని పెంచాలని కోరింది. ఈ పరిస్థితుల్లో, భారత ప్రభుత్వం జీఈ సంస్థకు నిబంధనల ప్రకారమే పలు మార్పులు చేసినట్లు సమాచారం.

    వివరాలు 

    99 ఇంజిన్ల సరఫరాకు ఒప్పందం 

    జీఈ, HAL 2021లో 99 ఇంజిన్ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, డెలివరీల జాప్యంలో అమెరికా ఒత్తిడి వ్యూహాలు లేకపోవడం దృష్ట్యా, దక్షిణ కొరియా సంస్థ ఆర్థిక సమస్యల కారణంగా ఇంజిన్ విడిభాగాలను అందించలేకపోయింది.

    ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం, ఈ టెక్నాలజీని ఇక్కడే తయారు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనను జీఈకి తెలియజేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారతదేశం

    NSG New Chief: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ బీ శ్రీనివాసన్ నియామకం భారతదేశం
    IMA On Doctors Safety: భారతదేశంలో నైట్ షిఫ్ట్‌లో 35% మంది వైద్యులు అసురక్షితం.. ఐఎంఏ  అధ్యయనంలో కీలక విషయాలు.. భారతదేశం
    #Newsbytesexplainer: ఉచిత పథకాలు రాష్ట్రాల ఖజానాకు గండి పెడుతున్నాయా.. ఇది తెలుసుకోవడం చాల ముఖ్యం భారతదేశం
    Helicopter:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025