NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్
    తదుపరి వార్తా కథనం
    Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్
    భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్

    Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

    ఆయన 2040 నాటికి భారతీయుడు చంద్రుడిపై కాలుమోపే అవకాశం ఉందని కూడా చెప్పారు.

    సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష మంత్రిత్వశాఖలు ఈ ఏడాది చేపట్టిన కీలక కార్యక్రమాల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ''భారతదేశం సొంత స్పేస్‌ స్టేషన్‌ను 2035 నాటికి సిద్ధం చేసుకుంటుంది. ఇది అమెరికా వంటి దేశాల తరహాలో అనేక అంతరిక్ష కేంద్రాలున్న దేశాల సరసన నిలబడేలా చేస్తుంది'' అన్నారు.

    ఆయన భారతదేశం మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ''గగన్‌యాన్ మిషన్'' గురించి కూడా వివరించారు.

    వివరాలు 

    భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్ సముద్రయాన్

    2024 చివరికి లేదా 2026 ప్రారంభంలో మొదటి భారతీయ వ్యోమగామి గగన్‌యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతారని చెప్పారు.

    ఈ సందర్భంగా, జితేంద్రసింగ్ భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్ ''సముద్రయాన్'' గురించి కూడా మాట్లాడారు.

    సముద్రయాన్‌లో భాగంగా, మత్స్య-6000 జలాంతర్గామిని రూపొందించారు, దీని ద్వారా ముగ్గురు వ్యక్తులు 6 కిలోమీటర్ల (6,000 మీటర్ల) సముద్రపు గరిష్ట లోతుకు చేరుకోవచ్చు.

    దీని ద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చని తెలిపారు.

    వివరాలు 

    భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ

    ఈ జలాంతర్గామి చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేస్తున్నది.

    సముద్ర అన్వేషణలో దోహదపడే ఈ మిషన్ భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణగా గుర్తింపబడుతుంది.

    జితేంద్రసింగ్ ప్రస్తుతం భారతదేశం ఉపగ్రహ ప్రయోగాలలో విశేష పురోగతి సాధించిందని చెప్పారు.

    ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించాయని, వాటిలో 397 (90 శాతం) గత దశాబ్దంలోనే ప్రయోగించామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జితేంద్ర సింగ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    జితేంద్ర సింగ్

    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పెన్షన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025