NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rammohan Naidu: భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్‌ నాయుడు
    తదుపరి వార్తా కథనం
    Rammohan Naidu: భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్‌ నాయుడు
    భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్‌ నాయుడు

    Rammohan Naidu: భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్‌ నాయుడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 11, 2025
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య సంవత్సరానికోసారి పెరుగుతుండటంతో, ఆయా సంస్థలు విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో, రాబోయే కాలంలో పైలట్ల అవసరం భారీగా పెరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

    రాబోయే 15-20 ఏళ్లలో దాదాపు 30,000 పైలట్లు అవసరమవుతారని తెలిపారు. 200 శిక్షణ విమానాల కొనుగోలుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

    వివరాలు 

    1,700కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా 800కు పైగా విమానాలు సేవలందిస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

    ప్రస్తుతం 6,000 నుండి 7,000 మంది పైలట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వివిధ సంస్థలు 1,700కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చాయని పేర్కొన్నారు.

    రాబోయే కాలంలో అవి సేవలందించనున్నాయని వివరించారు. దీని ప్రభావంగా, వచ్చే 15-20 ఏళ్లలో 30,000 పైలట్లు అవసరమవుతారని చెప్పారు.

    భారత్‌ను పైలట్ శిక్షణ హబ్‌గా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించారు.

    విమానయాన రంగ అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖ సమగ్ర వ్యూహంతో ముందుకు సాగుతోందని తెలిపారు.

    38 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థలను పరిశీలించి, వాటికి అధికారుల ద్వారా రేటింగ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు రాజమహేంద్రవరం
    Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు  విజయనగరం
    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్ బాంబు బెదిరింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025